పంతం నెగ్గించుకున్న పొంగులేటి… ఖ‌మ్మం సీటు ఆయ‌న‌కే!?

ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుండి ఒక్క‌రినీ కూడా అసెంబ్లీ గేటు తాక‌నివ్వ‌ను అంటూ స‌వాల్ విసిరి మ‌రీ పంతం నెగ్గించుకున్న నేత పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. పొంగులేటి చేరిక త‌ర్వాత కాంగ్రెస్ లో క‌నిపించిన జోష్ అంతా ఇంతా కాదు. అన్ని ర‌కాలుగా బ‌ల‌మైన నేత కావ‌టం కాంగ్రెస్ కు క‌లిసిరాగా, ఎంపీ ఎన్నిక‌ల్లో పెద్ద త‌ల‌నొప్పే తెచ్చిపెట్టింది.

కాంగ్రెస్ గెలుపు క‌న్ఫామ్ అనుకున్న సీట్ల‌లో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న సీటు ఖ‌మ్మం. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు కూడా ఖ‌మ్మం గెలవ‌లేం అన్న‌ట్లుగా ఫిక్స్ అయిపోయిన త‌రుణంలో గెలిచే సీటు ఎవరికి అన్న పోటీ నెల‌కొంది. వీహెచ్ మొద‌లు చాలా మంది నేత‌లు ఖ‌మ్మం సీటు కోసం ప్ర‌య‌త్నించారు. ఈ లిస్టులో డిప్యూటీ సీఎం భ‌ట్టి భార్య‌, మంత్రి పొంగులేటి సోద‌రుడు, మంత్రి తుమ్మల కొడుకు ఉండ‌టంతో హాట్ టాపిక్ గా మారింది. అధినాయ‌క‌త్వం కూడా ఆ సీటుపై ఏటూ తేల్చ‌లేదు.

అయితే, ఏఐసీసీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం… ఖ‌మ్మం సీటుపై మంత్రి పొంగులేటి త‌న పంతం నెగ్గించుకున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సోద‌రుడు ప్ర‌సాద్ రెడ్డికి టికెట్ క‌న్ఫామ్ అయిన‌ట్లు స‌మాచారం. ఇక మ‌రో పెండింగ్ సీటు క‌రీంన‌గ‌ర్ నుండి అంద‌రూ ఊహించిన‌ట్లుగానే వెలిచాల రాజేంద‌ర్ రావుకు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. ఈ రెండు సెగ్మెంట్ల‌తో పాటు హైద‌రాబాద్ సీటు కూడా పెండింగ్ లో ఉన్నాయి.

ఒక‌ట్రెండు రోజుల్లో ఈ మూడు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఏఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close