పార్టీ నేతల మీద కిషన్ రెడ్డికి ఎందుకు కోపంవచ్చింది?

తెరాసకి ప్రత్యామ్నాయం మేమే, కేసీఆర్ ని గద్దెదింపి అధికారంలోకి వచ్చేది మేమే, రాష్ట్ర ప్రజలంతా మావైపే చూస్తున్నారు… గత కొద్ది రోజులుగా తెలంగాణ భాజపా నేతలు చేస్తున్న ప్రకటనలివి. నిజానికి, ఒక రాజకీయ పార్టీ అసలైన బలం… నాయకులు మైకులు ముందు చేసే ప్రకటనల్లో కనబడదు, పోలింగ్ కేంద్రాల్లో అసలు సత్తా తేలుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస వెర్సెస్ భాజపా మధ్యే అసలైన పోటీ అంటూ… తమ స్థాయిని తెలంగాణలో రెండో పెద్ద పార్టీగా చిత్రించుకుంటూ వచ్చారు కమలనాథులు. అయితే, వాస్తవం ఏంటో ఇప్పుడు అర్థమౌతోంది. తత్వం బోధపడ్డాక తలలు పట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ముగిసిన నేపథ్యంలో పార్టీ నేతలతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, బీజేపీ క్లస్టర్ ఇన్ ఛార్జ్ కిషన్ రెడ్డి. పార్టీ నేతల పనితీరు మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

భాజపా తరఫున వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారనీ, పార్టీ ఆఫీస్ ముందు క్యూలు కడుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన ఓ పత్రికతోపాటు, కొంతమంది నాయకులూ ఊదరగొడుతూ వచ్చారు. వాస్తవం ఏంటంటే… రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం వార్డుల్లో భాజపాకి అభ్యర్థులే దొరకలేదు. రాష్ట్రంలో మొత్తంలో 2,727 వార్డులుంటే అన్ని చోట్లా అభ్యర్థుల్ని నిలబెట్టడంలో నాయకులు విఫలమయ్యారన్నమాట. దీంతో, పార్టీ ఆఫీస్ లో జరిగిన సమీక్షలో కిషన్ రెడ్డి తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ, నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. జిల్లాలో ఏ మారుమూలో అభ్యర్థులు దొరకలేదంటే కొంత నయమనీ, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను నిలబెట్ట లేకపోవడం మరీ దారుణమని, నాయకులు ఏం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉందని చెప్పుకుంటున్నామనీ, పూర్తి స్థాయిలో పోటీ పడలేకపోతున్నామంటే ఏమనుకోవాలని కొందరు నాయకుల్ని నిలదీశారట.

ఇప్పుడు ఏం చెయ్యాలి అనే అంశమై పార్టీ నేతలతో కిషన్ రెడ్డి చర్చంచారని సమాచారం. ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారిపై ద్రుష్టిపెట్టాలనీ, రెబెల్స్ గా బరిలోని దిగినవారిని మనవైపు తిప్పుకోవాలనే వ్యూహం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసిన రెబెల్స్ తో వెంటనే టచ్ లోకి వెళ్లాలనీ, వారి పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా భయపడొద్దనీ, నామినేషన్లు వెనక్కి తీసుకోవద్దనీ, అన్ని రకాలుగా భాజపా సాయం చేస్తుందంటూ భరోసా కల్పించాలంటూ కిషన్ రెడ్డి సూచించారని తెలుస్తోంది. అంటే, ఇప్పుడు భాజపా చాలా స్థానాల్లో రెబెల్ అభ్యర్థుల మీద ఆశలు పెట్టుకుంటోందన్నమాట. ఈ పరిస్థితి రావడానికి కారణం, సరైన ప్రణాళికతో రాష్ట్ర నాయకత్వం లేకపోవడమే అనాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close