దళిత బంధు పథకానికి ఈటల పేరు పెట్టాలట!

తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం దళిత బంధు. ఆ క్రెడిట్ సంపూర్ణంగా ఆయనదే. హుజురాబాద్‌లో ఈటలకు చెక్ పెట్టేందుకు అక్కడి దళిత వర్గాలందర్నీ ఆకట్టుకునేందుకు కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెట్టారని భావిస్తూంటారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా అదే అనుకుంటున్నారు. అంతే కాదు.. అసలు ఆ పథకానికి ఈటల రాజేందర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఈటల వల్లే ఆ పథకం పురుడు పోసుకుందని అందుకే ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈటల రాజేందర్ కోసం ఆయన ప్రస్తుతం హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం గురించి ప్రస్తావించి అది ఈటల వల్లనే వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఈటలకు కౌంటర్ ఇవ్వడానికి .. తెలంగాణలోని దళిత వర్గాలన్నింటినీ ఏకపక్షంగా మద్దతుదారులుగా మల్చుకోవడానికి కేసీఆర్ దళిత బంధుకు రూపకల్పన చేశారని చెబుతున్నారు కానీ.. ఇప్పటి వరకూ దానికి ఈటల పేరు పెట్టాలనే ఆలోచన కానీ.. డిమాండ్ కానీ రాలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆ డిమాండ్ తీసుకొచ్చారు.

పొరుగు రాష్ట్రంలో ఏ చిన్న పని చేసినా.. చివరికి శుభ్రత కార్యక్రమాలు చేపట్టిన జగనన్న పేరు పెట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పథకాలను పథకాలుగానే ఉంటుతున్నారు, కేసీఆర్, కేటీఆర్ పేర్లు పెట్టుకోడం లేదు. కొత్తగా పథకానికి ఈటల పేరును పెట్టాలన్న డిమాండ్‌తో పథకాలకు పేర్ల అంశం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close