తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మళ్లీ ఏబీఎన్ డిబేట్లలో కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల నుంచి ఆయన మళ్లీ టీవీల్లో టీడీపీ కోసం తన వాయిస్ వినిపిస్తున్నారు. నిజానికి ఆయనను టీడీపీ దూరం పెట్టింది. పిలిచి తిరువూరు టిక్కెట్ ఇస్తే అక్కడ పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహంతో ఉంది. పార్టీ నేతలంతా ఆయనకు వ్యతిరేకంగా మారడంతో ఆయనకు రెండు సార్లు పిలిచి వార్నింగ్ ఇచ్చారు కూడా. ఇక పార్టీతో ఆయనకు సంబంధం లేదని అనుకున్నారు.
ఆ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువగా ప్రచారం చేసి ఆంధ్రజ్యోతినే. కొలికపూడి చేసే ప్రతి పనిని విమర్శించింది. ఆయనపై ఆరోపణలు చేసేవారికి ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో కొలికపూడిపై వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరగడానికి కారణం అయింది. ఈ కోపం ఆయన బహిరంగంగానే చూపించారు. ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడులు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
నిజానికి కొలికపూడి ఎన్నికలకు ముందు ఏబీఎన్ లో రెగ్యులర్ ప్యానలిస్టు. ఆయన ఓ సారి బీజేపీ నేత విష్ణువర్ధన్ పై చెప్పుతో దాడిచేశారు. మామూలుగా అయితే ఇక డిబేట్లకు పిలవకూడదు.కానీ కొలికపూడికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాక ఆయన దూరం అయ్యారు. ఇప్పుడు కొలికపూడి దారికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మళ్లీ డిబేట్లలో మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతిలో ఆయనపై వ్యతిరేక వార్తలు కూడా ఆగిపోయాయి.