అమరావతి ప్రాంత మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించేందుకు దిగజారిపోయిన సాక్షి టీవీ జర్నలిస్టు, మాజీ ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణంరాజు అనే జర్నలిస్టుతో చర్చా కార్యక్రమం నిర్వహించి ఓ నివేదిక పేరుతో వేశ్యల రాజధాని అమరావతి అని వీరిద్దరూ తమ వికారాన్ని చూపించారు.
మహిళల్ని వీరు అవమానించిన తీరుపై ఏపీ వ్యాప్తంగా ప్రజలు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు నారా లోకేష్ సహా ప్రభుత్వ పెద్దలందరూ వీరి తీరుపై మండిపడ్డారు. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఏ వన్ గా కృష్ణంరాజు, ఏ టు గా కొమ్మినేని శ్రీనివాసరావు, ఏ త్రీగా సాక్షి యాజమాన్యాలను ఈ కేసులో చేర్చారు.
తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా కొమ్మినేనిని హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం సహా వివిద సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చట్టబద్ధంగా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారి సహకారంతోనే అరెస్టు చేశారు. ఏ వన్ గా ఉన్న కృష్ణంరాజు అనే వ్యక్తిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
కొమ్మినేని గతంలో న్యాయవ్యవస్థపైనా అనుచితమైన కథనాలు రాసి.. వివాదాస్పదుడయ్యారు. జగన్ రెడ్డి కోసం పని చేస్తూ.. ఆయన జర్నలిస్టు ముసుగులో అ్ని వ్యవస్థపై దాడి చేసే ప్రయత్నం చేశారు.