జగన్ రెడ్డి విసురుతున్న ఎంగిలి మెతుకులు తింటున్న విశ్వాసం చూపించడానికి .. తమ వయసు, బుద్ది, జ్ఞానం అన్ని మర్చిపోయిన కొంత మంది లేకి మనుషులు దిగజారిపోతున్నారు. తమ ఇళ్లల్లో ఆడవాళ్లు ఉంటారని, తమ తల్లులు, భార్యలు, చెల్లెళ్లు, అక్కలు సహా ఎంతో మంది ఆడవాళ్ల మీద తాము ఆధారపడి ఉంటామని వారు కనీసం ఆలోచించలేకపోతున్నారు.పబ్లిక్ గా టీవీలో కూర్చుని అత్యంత అసహ్యంగా మాట్లాడుతున్నారు.
అమరావతి వేశ్యల రాజధాని… అమరావతిలో ఉన్న మహిళలంతా వేశ్యలంటూ కష్ణంరాజు అనే ఊరుపేరూ లేని పత్రికను నడుపుకునే జర్నలిస్టు అంటే.. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు వంత పాడారు. అత్యంత ఘోరంగా ఉన్న ఈ మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వారి పై కేసులు పెట్టి అరెస్టు చేయాలన్న డిమాండలు వినిపిస్తున్నాయి. అమరావతి మహిళలు నిరసనలు ప్రారంభించారు.
ఇటీవల కిరణ్ అనే టీడీపీ కార్యకర్త.. భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెట్టి చాలా రోజులు జైల్లో ఉంచారు. ఇప్పుడు అందరు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఎలా వదిలి పెడతారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కూర్చుంటే లేవలేని.. ఇద్దరు పట్టుకుంటే నడవాల్సిన పరిస్థితిలో ఉన్న కొమ్మినేని కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కృష్ణంరాజు కానీ.. మరో జర్నలిస్టును కూడా సహించే అవకాశాలు లేవు.
ఇలా మాట్లాడి అధికారం కోల్పోయారు. ఇంకా సాక్షి మీడియాలో అందర్నీ బూతులు తిట్టించి జగన్ రెడ్డికి మానసిక ఆనందం కలిగిస్తూ.. తాము బలిపశువులు అవుతున్నారు. వీరిద్దరికీ బడితే పూజ చేస్తే కానీ మరొకరు నోరు విప్పకుండా ఉంటారన్న వాదన వినిపిస్తోంది.