వైసీపీకి మద్దతిచ్చినందుకు కోనకు అలా కలిసొచ్చిందా..?

ఎన్నికల సమయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ కు… సమర్థించేందుకు ఇతర పార్టీలపై తిట్లు లంకించుకున్న సినీ ప్రముఖులకు ఒక్కొక్కరిగా తాయిలాలు అందిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కు మద్దతివ్వడం అంటే.. ఇతర పార్టీల నేతలను ఇష్టం వచ్చినట్లు తిట్టడమే అనుకునే రాజకీయం చేసిన సినీ కమెడియన్ ఫృధ్వీ.. తన రాజకీయం కారణంగా.. సినిమా అవకాశాలు కోల్పోయారు. అదే విషయాన్ని వైసీపీ హైకమండ్ కు తెలిసేలా చేసుకుని ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి పొందారు. మిగతా నటులకు పదవులు లైన్లో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందరికీ పదవులే కాదు.. కొంత మందికి ఇతర లాభాలు కూడా కల్పించబోతున్నారని.. తాజాగా కొన్ని పరిణామాలతో వెల్లడవుతోంది.

గత ఎన్నికలకు ముందు.. టీడీపీపై సామాజిక వర్గ కోణంలో విమర్శలు చేసి వైసీపీకి మద్దతు పలికిన… రచయిత కోన వెంకట్.. ఇప్పుడు తాను.. రూ. 500 కోట్లతో.. ఓ డిస్నీలాండ్ తరహా స్టూడియోను… నిర్మించబోతున్నట్లుగా ప్రకటించారు. అది కూడా.. ఆయన బంధువు కోన రఘుపతి ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గంలోనట. ఆ నియోజకవర్గంలో సూర్యలంక బీచ్ ఉంది. పర్యాటకంగా కొంచెం పేరున్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో… రూ. 500 కోట్లతో.. స్టూడియో ఏర్పాటు చేస్తామని సర్వే కూడా ప్రారంభించారు. నిజానికి ప్రైవేటు వ్యక్తులు ఇలా సర్వేలు చేయడం నిషిద్ధం. కానీ.. అధికారుల అనుమతి తీసుకున్నామని… కోన చెబుతున్నారు.

ఓ అంతర్జాతీయ సంస్థ.. మరో రాష్ట్ర సంస్థ.. ప్రభుత్వ సంస్థ అంటూ.. కోన వెంకట్.. చాలా పేర్లు చెబుతున్నప్పటికీ.. భూములు కేటాయించాల్సింది మాత్రం ప్రభుత్వమే. ఏదో హామీ రాకపోతే.. నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లి కోన వెంకట్ భూముల సర్వే చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. దగ్గరి బంధువే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి… పరిస్థితి మరింత అనుకూలం. మరి ప్రభుత్వం తరపున కోన వెంకట్ కు…ఎంత మేర ప్రయోజనం లభిస్తుందో.. ఆయన అంత పెద్ద మొత్తం పెట్టి… స్టూడియో నిర్మిస్తారో లేదో… వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close