‘ఆచార్య‌’ రీషూట్ల‌పై కొర‌టాల క్లారిటీ

ఈమ‌ధ్య `రీషూట్‌` అనే మాట చాలా స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. అందులోనూ పెద్ద సినిమాల‌కు. ఏకంగా క్యారెక్ట‌ర్ల‌నే మార్చేసి, వాళ్ల‌పై తీసిన సీన్ల‌న్ని ప‌క్క‌న పెట్టి, మ‌ళ్లీ కొత్త‌గా సీన్లు రాసుకుని, తెర‌కెక్కించిన సంద‌ర్భాలున్నాయి. సినిమా పూర్త‌యినా, క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన సంద‌ర్భంలో.. ఆ సినిమాని చూసుకుని, మార్పులు చేర్పులు చేసుకునే అవ‌కాశం ద‌క్కింది. దాంతో.. రీషూట్లు మొద‌లైపోయాయి. ఆచార్య విష‌యంలోనూ చాలానే రీషూట్లు జ‌రిగాయ‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై కొర‌టాల శివ తొలిసారి స్పందించారు. ఆచార్య‌కు రీషూట్లు ఏం జ‌ర‌గ‌లేద‌ని చెబుతూనే.. అస‌లు రీషూట్లు చేయ‌డం త‌ప్పేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

“రీషూట్ అనేది ఓ త‌ప్పుడు భావ‌న కింద తీసుకుంటారు. రీషూట్ చేయ‌డంలో త‌ప్పేముంది? ఓ సీన్ అనుకున్న‌ట్టు రాక‌పోతే.. మ‌రోసారి తీయొచ్చు. స‌రిగా లేక‌పోయినా పాస్ చేయ‌లేం. అది సినిమాని న‌మ్మి వ‌చ్చే ప్రేక్ష‌కులకు అన్యాయం చేయ‌డం వంటిదే. ఓ సీన్ బాగా వ‌చ్చేంత వ‌ర‌కూ ఎన్నిసార్ల‌యినా తీయొచ్చు. అంతిమంగా ప్రేక్ష‌కుడికి ఆ సీన్ న‌చ్చేలా చేయ‌డ‌మే ద‌ర్శ‌కుడి బాధ్య‌త‌“ అని వివ‌ర‌ణ ఇచ్చారు. చిరంజీవి, చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన `ఆచార్య‌` ఈనెల 29న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫర్ సరే.. మద్దాలి గిరిది ఏ పార్టీ.. ఏ పార్టీకి ఓటేశారు !?

ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలై.... ధిక్కరించిన ఎమ్మెల్యేలంటూ కొంతమంది పై వేటేసిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తమకు కూడా ఆఫర్లు...

పోలవరం ఎత్తు లోక్‌సభకు..రాజ్యసభకు వేర్వేరు !

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో కేంద్రం ఆటలు ఆడుతోంది. క్లారిటీ లేకుండా విరుద్ధమైన సమాధానాలు చెబుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు గత నాలుగేళ్లుగా పూర్తిగా ఆగిపోయాయి. డబ్బులు రీఎంబర్స్ చేయాల్సిన పని...

రాజీనామా డిమాండ్లను సీరియస్‌గా తీసుకుంటున్న కేటీఆర్ !

పేపర్ల లీకేజీ విషయంలో విపక్ష పార్టీలన్నీ తనను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూండటంతో కేటీఆర్ అసహనానికి గురవుతున్నారు. విపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోమవారం సిరిసిల్ల రాజన్న జిల్లాలో...

కుమారుల రాజకీయంతో నలిగిపోతున్న డీఎస్ !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగిన డీఎస్ ఇప్పుడు కుమారుల రాజకీయంతో నలిగిపోతున్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. కానీ సోమవారం ఆయన పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close