కొత్తపలుకు : ఆ నాలిక మడతేసిన వాళ్లలో “ఆర్కే” లేరా..?

ఆంధ్రజ్యోతి ఎండీ.. వేమూరి రాధాకృష్ణ.. ప్రతీ వారం రాసే కొత్త పలుకులో.. స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ.. ఆయన రచనలు.. ఓ పంథాలో సాగగా.. ఇప్పుడు… ట్రెండ్‌కు తగ్గట్లుగా కనిపిస్తున్నాయి. ఏపీ కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డిని అభినందించడానికి ఆయన కూడా పోటీ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం రాసిన ఆర్టికల్‌లోనూ ఆయన… అదే తరహా భావనలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు.

జగన్ మధ్య అంత తేడా కనిపిస్తోందా…?

” తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరించిన తీరును గమనించిన వారికి ఆయన ముఖ్యమంత్రి అయితే..? అన్న భయాలు ఉండేవి…” అని.. రాధాకృష్ణ తన వ్యాసంలో రాసుకొచ్చారు. అంటే.. అప్పుడెలా ఉండేవారో.. ఓ ఉదాహరణగాచెప్పి ఉండాల్సింది. అలాగే.. ఇప్పుడెలా ఉంటున్నారో మరో ఉదహరణగా చెప్పాల్సి ఉంది. కానీ… అలాంటివేమీ లేకుండా.. జగన్మోహన్ రెడ్డి… అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు మారిపోయారని… ఎంతో మంచిగా ఉంటున్నారని.. చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో చాలా మందికి అర్థం కాలేదు. ఆ జగన్మోహన్‌ రెడ్డి, ఈ జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరేనా అని … రాధాకృష్ణ కూడా సందేహ పడాల్సిన పరిస్థితి… వచ్చిందంటే.. ఆ మార్పు.. జగన్మోహన్ రెడ్డిలోనా.. లేక రాధాకృష్ణలోనా అన్నదానిపై పాఠకులే నిర్ణయించుకోవాల్సి ఉంది.

బీజేపీతో వైరానికి చంద్రబాబును ప్రొత్సహించిన వాళ్లలో ఆర్కే లేరా…?

చంద్రబాబు రాజకీయ నిర్ణయాలు ఇటీవలి కాలంలో సొంతంగా తీసుకోవడం లేదని.. ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటూ ఉంటాయి. ఓ కోటరీ ఉంటుందని.. ఆ కోటరీలో ఆర్కే కూడా ఉంటారని చెబుతారు. ఆ కోటరీ ఇచ్చే సూచనలు.. సలహాలు మేరకే… బీజేపీతో ఎగ్రెసివ్ గా వెళ్లారని చెబుతూంటారు. నిజానికి భారతీయ జనతా పార్టీతో సున్నం పెట్టుకోవాలని చంద్రబాబుకూ లేదని చాలా మంది చెబుతారు. కానీ.. కారణం ఏదైనా… మోడీతో.. దూరం పెరిగింది. దాన్ని దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా… మీడియా… మరికొంత మంది ప్రభావంతో… పెద్దది చేసుకున్నారు. బయటకు వస్తేనే మంచిదన్న భ్రమలు కల్పించి… అలాగే చేయించారు. చివరికి అలాంటి వాళ్లందరూ నాలిక మడతేశారు. చివరికి ఆర్కే కూడా., హోదా విషయంలో ఉద్యమాలకు పులికొల్పింది ఆంధ్రజ్యోతి. కానీ ఆర్కే మాత్రం.. అప్పుడప్పుడు.. తన వ్యాసాల్లో… హోదా రాదు.. వస్తే మంచిది అంటూ కామెంట్లు చేశారు. దాన్నే చూపించి.. తాను ముందే చెప్పానని చెబుతున్నారు. కానీ వాస్తవానికి .. చంద్రబాబు.. బీజేపీతో విరోధం పెంచుకోవడానికి… ఆర్కే కూడ ఓ కారణమని చెబుతారు.

జగన్ అంత గొప్పగా అవినీతిని కట్టడి చేస్తారని ఎలా అనుకుంటున్నా..?

వేమూరి రాధాకృష్ణ.. చంద్రబాబు బీజేపీతో సున్నం పెట్టుకున్నట్లుగా.. జగన్ తో పెట్టుకుని తానెందుకు నష్టపోవాలని అని అనుకుంటున్నారేమో .. అన్న అభిప్రాయం ఏర్పడకుండా ఉండదు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి.. అవినీతి ప్రక్షాళన అనే మాటలు కేవలం.. మాటల్లోనే చెబుతున్నారని.. ఆయనకు స్పష్టంగా తెలుసు. ప్రమాణస్వీకారం చేయకుండానే… నిబంధనలకు విరుద్ధంగా.. సొంత పత్రికకు.. రూ. కోట్ల కొద్దీ ప్రకటనలు ఇచ్చి… ఇతర పత్రికలకు చాలా పరిమితంగా ప్రకటనలు ఇచ్చినప్పుడే.. జగన్మోహన్ రెడ్డి.. ఎలా పరిపాలించబోతున్నారో ఎవరికైనా సులువుగా అర్థమైపోతుంది. సాధారణంగా ఎవరైనా తన పత్రికకు.. అలా ప్రకటనలు ఇచ్చుకోవాలంటే.. నిబంధనలకు అనుగుణంగా ఉన్నా… నైతికత కాదనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా అనుకోలేదు. పైగా ఆంధ్రజ్యోతికి ఇవ్వాల్సిన ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. అన్నీ అనుమానాస్పదంగానే ఉంటున్నాయి. కానీ ప్రశ్నించడం ఇప్పుడే ఎందుకు అనుకుంటున్నారో… ప్రశ్నించి .. ఏం సాధిస్తామనుకుంటున్నారో కానీ.. ఆర్కే కూడా.. నాలుక మడతేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close