వైసీపీకి అంటుకున్న దళితులపై దాడుల మంటలు !

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో ఆ పార్టీ నేతలు ఎవరూ స్పందించడం లేదు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఎప్పుడైనా స్పందిస్తే ఆయన పదవి నుంచి తీసేస్తామని బెదిరింపులకు దిగేవారు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. అయితే హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసినా సైలెంట్ గా ఉన్న దళిత వర్గాలు ఇప్పుడు వైసీపీపై తిరుగుబాటు చేస్తున్నాయి. హోంమంత్రి నియోజకవర్గం అయిన కొవ్వూరులోని దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడి ఆత్మహత్య ఘటన దళిత వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. వైసీపీ పార్టీకి చెందిన జడ్పీటీసి సమీప బంధువు అయినప్పటికీ పోలీసులు వ్యవహరించిన తీరుతో దళిత యువకుడు తన చావుకు కారణం ఎవరో చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. దళితులంటే ఎంత చిన్నచూపు చూస్తున్నారో వారికి క్లారిటీ వస్తోంది. నిజానికి ఇంత కాలం అధికార పార్టీలో ఉన్నామనో.. అధికార పార్టీకి భయపడో.. సైలెంట్ గా ఉన్నారు. ఇంకా సైలెంట్ గా ఉంటే.. తమను ఇక లేవనీయరని అర్థమైంది. గిరి గీసి బరిలోకి దిగుతున్నారు. దొమ్మేరులో లో పోలీసులు బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు. హోంమంత్రి వనిత కొవ్వూరులో ఉండలేక విజయవాడ వెళ్లిపోయారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ చేయిస్తామని ఆమె చేసిన ప్రకటన మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. సీఐడీ అంటే కామెడీ అయిపోయింది. ఏ రిపోర్టు కావాలంటే ఆ రిపోర్టు ఇస్తారు.

ఇక్కడ కూడా మోసం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరిగిన దాడుల విషయంలో దళిత సంఘాలు రోడ్డెక్కాలని భావిస్తున్నాయి. సంచలనం సృష్టించిన కేసుల్లోనూ నిందితులని పట్టుకోకపోవడం.. కేసులు పెట్టకపోవడం డోర్ డెలివరీలు చేసిన వారిని పక్కన పెట్టుకుని ప్రోత్సహించడం వంటివాటిపై తగ్గకుండా పోరాటం చేయాలని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నయి. దేశంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ లభించింది. జాతీయ మీడియాలు...

ఏపీ పోలీసులతో సాగర్ గేట్లు ఎత్తేయించి జగన్ రెడ్డి సాధించిందేంటి ?

తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.....

ప్రాసెస్‌లో క్వాష్ పిటిషన్‌పై తీర్పు : సుప్రీంకోర్టు ధర్మాసనం

చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రాసెస్ లో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై...

తెలంగాణ ఓటరు నిరాసక్తత

తెలంగాణ ఓటరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఎక్కడా కనిపించడం లేదు. మధ్యాహ్నం ఒంటింగంట వరకూ పోలింగ్ పర్సంటేజీ కేవలం 37 శాతం వరకే ఉంది. 2018లో ఇది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close