ఆలస్యంగా.. అరకొరగా కెటిఆర్‌ నష్టనివారణ…

బెటర్‌ లేట్‌ దేన్‌ నెవర్‌ అన్నట్టు మంత్రి కెటిఆర్‌ చాలా ఆలస్యంగా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తన స్వంత నియోజకవర్గం నేరెళ్లలో లారీ ప్రమాదం, ధగ్ధం కేసుకు సంబంధించి పోలీసుల చిత్రహింసలకు గురైన బాధితులను నెలరోజుల తర్వాత పరామర్శించారు. అన్ని హంగులూ అవకాశాలు వున్న వ్యక్తి ఇంత సమయం తీసుకోవవలసింది కాదు. తనకు స్థానిక నాయకత్వం సకాలంలో సమాచారం ఇవ్వలేదని ఆయన అంటున్నారు గాని వాస్తవానికి ఆ రోజునే స్వయంగా నేను పాల్గొన్న చర్చలోనే దీన్ని విమర్శించాం. ఎప్పట్లాగే నేను షెహన్‌షా నియోజకవర్గంలో జరిగినా జోక్యం చేసుకోకపోతే ఎలా అని వ్యాఖ్యానించాను కూడా. మీడియాలో సరే చాలా వ్యాసాలు వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతల పర్యటనలూ సాక్షాత్తూ మీరాకుమార్‌ లాటి జాతీయ ప్రముఖుల రాక ఇన్ని జరిగాక ఇప్పుడు ఇలా అంటే ఎలా కుదురుతుంది? గతంలో ఒకసారి దీనిపై ఆయన ట్వీట్‌ చేశారు గాని రాజకీయ జవాబులకే పరిమితమైనారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా ఆలస్యంగానైనా సరే జరిగింది దురదృష్టకరం అన్నాక ఇప్పుడు కెటిఆర్‌ వచ్చారు. పోలీసుల అత్యుత్సాహం కారణమని చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే మాఫియా అన్న పదం వాడటమే పొరబాటని అంతగా సమర్థించాల్సిన అవసరం కనిపించదు. చాలా రకాల శక్తులు రంగంలో వున్నాయి. రాజకీయ బాధ్యత కూడా వహించవవలసి వుంటుంది.

మరో సంజాయిషీ హిమాన్షు మోటార్స్‌కు సంబంధించి. అది ఎప్పుడో మూతపడిందన్నట్టు కావాలంటే రాసిస్తానన్నట్టు గతంలో మాట్లాడారు. ఇప్పుడేమో సాంకేతికంగా తప్ప వాస్తవికంగా మూత పడినట్టేనని సర్దుబాటు చేశారు. ఇది కూడా పరోక్షంగా అంగీకరించడమే. కెటిఆర్‌ లాటి ముఖ్య నాయకులు మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలసిన అవసరాన్ని ఈ ఉదంతాలే చెబుతున్నాయి. రెండవది సకాలంలోస్పందించాలని గుర్తు చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close