తెరపైకి “గ్రేటర్‌ సీమ” డిమాండ్..!

గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ సీనియర్ నేతలు..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. గతంలో.. కలిసి ఉండాలన్న కారణంగా.. కర్నూలు రాజధానిని త్యాగం చేశామని.. త్యాగాలను గుర్తించి ఇప్పటికైనా.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని.. పార్టీలకు అతీతంగా సీనియర్‌ నేతలంతా జగన్‌కు లేఖ రాశారు. రాయలసీమ నాలుగు జిల్లాలు మాత్రమే కాకుండా.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని ఈ నేతలు.. గ్రేటర్ రాయలసీమగా పేర్కొంటున్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు హర్షణీయమన్న నేతలు,… పరిపాలన వికేంద్రీకరణను సమర్ధిస్తున్నామని ప్రకటించారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్‌, రెడ్డివారి చెంగారెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి, దినేష్‌రెడ్డి ఈ గ్రేటర్ రాయలసీమలో రాజధాని డిమాండ్‌ను వినిపించారు. హైకోర్టులో ఓ బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయడం వల్ల.. రాయలసీమ ప్రజలకు ఒరిగే లాభం కన్నా… సెక్రటేరియట్ ను విశాఖకు తరలించడం వల్ల ఎక్కువ నష్టం వస్తుందన్న అభిప్రాయం సీమ నేతల్లో ఉంది. అందుకే.. వారంతా.. రాజధాని కోసమే పోరాడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

టీజీ వెంకటేష్ లాంటి రాయలసీమ ఉద్యమ నేతలు.. విశాఖ సెక్రటేరియట్ ను ఒప్పుకోబోమని ప్రకటించారు. మూడు ప్రాంతాల మధ్య రాజధాని పంచాలని జగన్ చేసిన ప్రయత్నం.. కొత్త ప్రాంతీయ విబేధాలకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు ముందు.. వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని డిమాండ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close