మంగళగిరిలోనే పేదలకు ఇళ్లు – లోకేష్ శిలాఫలకం!

అమరావతిని విధ్వంసం చేయడానికి పేదల్ని పావులుగా వాడుకున్న జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని పేదలు తొందరగానే గుర్తిస్తున్నారు. ఇప్పుడా పేదలందరికీ వివాదాల్లేకుండా ఇళ్లు కట్టిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. పాదయాత్ర ఓ మైలు అందుకున్నప్పుడల్లా తాను చేయబోయే పనులను శిలాఫలకం మీద రాయించి ఆవిష్కరిస్తున్నారు. మంగళగిరికి చేరుకునే సరికి లోకేష్ పాదయాత్ర రెండున్నర వేల కిలోమీటర్లు అయింది. ఈ సందర్భంగా మంగళగిరిలో ఇరవై వేల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తానని శిలాఫలకం ఆవిష్కరించారు.

మంగళగిరిలో పేదలను వైసీపీ ప్రభుత్వం ఓ ఆటాడుకుంది. జగన్ రెడ్డి ఇంటి ముందు పేదల కాలనీ ఉండేది. మొత్తం తొలగించేసి కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడేశారు. వారెవరికీ కనీసం ఇళ్లు కూడా ఇవ్వలేదు. సెంటు స్థలాలు చూపించి బయటకు పంపేశారు. వారంతా ఇబ్బంది పడుతున్నారు. ఇక మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడనికి ప్రధాన కారణం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన తప్పుడు ప్రచారం. అమరావతి పేరుతో పేదల ఇళ్లు తొలగిస్తారని.. స్థలాలు లాగేసుకుంటారని చేసిన ప్రచారంతో ఎక్కువ మంది లోకేష్ కు వ్యతిరేకంగా ఓట్లేశారు.

వాటన్నింటినీ లోకేష్ పటాపంచలు చేస్తున్నారు. చాలా వరకూ అలాంటి పేదల ఇళ్లను వైసీపీ ప్రభుత్వమే కూల్చేసింది. తాను పేదల్ని రాజకీయం కోసం వాడుకోనని.. వారికి ఓ గూడు కల్పిస్తానని.. లోకేష్ హామీ ఇచ్చారు. అది నోటి మాటగా ఇచ్చింది కాకుండా. .. శిలాఫలకం ద్వారా అధికారంలోకి వచ్చాక., మర్చిపోకుండా.. మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉండేలా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close