జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ వార్నింగ్

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేయడాన్ని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. అమరావతిలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ కి రైతులే స్వచ్చందంగా ముందుకు వచ్చి 33000 ఎకరాలను ఇవ్వడం తెలియదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిల్లీలో పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం వలన రాష్ట్రానికి తీరని నష్టం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. గత ఎన్నికలలో తమ పార్టీ చేతిలో వైకాపా ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని, ఆయన తీరు ఇలాగే కొనసాగినట్లయితే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో వైకాపా కనబడకుండా మాయం అయిపోయినా ఆశ్చర్యం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో పుట్టి పెరిగారు కనుకనే పదేపదే అవినీతి మంత్రం వల్లెవేస్తున్నట్లున్నారని లోకేష్ ఎద్దేవా చేసారు.

వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా ఎత్తుకుపోవడం మొదలుపెట్టిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి, రాజధాని ప్రాంతంలో తెదేపా మంత్రులు, నేతల బినామీ భూముల కొనుగోళ్ళ వ్యవహారాన్ని బయటపెట్టి, ఫిరాయింపులను తాత్కాలికంగా నెమ్మదింపజేయగలిగారు. ఆ వ్యవహారం బయటపెట్టినప్పుడు తెదేపా జవాబు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడింది. తనపై జగన్ నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నందుకు ఆయనని కోర్టుకి ఈడ్చుతానని మంత్రి పి.నారాయణ హెచ్చరించారు కానీ అటువంటి ప్రయత్నమేదీ చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో జగన్ కూడా ఎందుకో కొంచెం వెనకడుగువేసినట్లు కనబడుతోంది. అందుకే వైకాపా ఎమ్మెల్యేల వలసలు మళ్ళీ మొదలయ్యాయి. వాటి జోరు పెరగడంతో, జగన్ మళ్ళీ దానికి అడ్డుకట్ట వేయడానికి “ఎంపరర్ ఆఫ్ కరప్షన్” అనే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసి ఈసారి డిల్లీ నుంచి ప్రయోగిస్తున్నారు. లోకేష్ తో సహా తెదేపా నేతలు అందరూ దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారయినా ఆ బ్రహ్మాస్త్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడాలి. పనిచేస్తే తెదేపాకి పనిచేయకపోతే వైకాపా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close