నమ్మండహే – సీఐడీ లుకౌట్ నోటీసులు పొరపాటున ఇస్తుంది !

లుకౌట్ నోటీసులు సీఐడీ పొరపాటున ఇస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఐడీ లాయర్ హైకోర్టుకు చెప్పారు. ఇలా నోటీసులు ఇచ్చి పొరపాటున ఇచ్చామని కవర్ చేసుకునే దర్యాప్తు సంస్థలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా.. అలాంటి సంస్థలపై కోర్టులు ఎలా స్పందిస్తాయన్నది తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు చెప్పిన కారణం మాత్రం.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. హైకోర్టులో సీఐడీ ఇలా చెప్పిందంటే.. రేపు తాము పెట్టిన కేసులన్నీ పొరపాటున పెట్టామని వాదించినా ఆశ్చర్యం లేకపోవచ్చు. అసలేం జరిగిందంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్‌ వేశారు. విచారణలో తనను నిందితుడుగా పేర్కొంటూ.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని అదే సమయంలో మళ్లీ మళ్లీ 161, 91 కింద నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి కిలారు రాజేష్ తరపు న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు.

అప్పుడు గతుక్కుమన్న సీఐడీ లాయర్ తాము ఎల్‌ఓసీ పొరపాటున ఇచ్చామని చెప్పుకొచ్చారు. తాము రాజేష్‌ను నిందితుడిగా పేర్కొనలేదని సీఐడీ న్యాయవాది చెప్పారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టుల ఈనెల 17కు వాయిదా వేసింది.

సీఐడీ వ్యవహారశైలి చూస్తూంటే.. కోర్టులు ఎలా భరిస్తున్నాయో కానీ.. చట్టంతో చెలగాటం అడుతున్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. ఆధారాల్లేని కేసులు పెట్టడం.. అడ్డగోలుగా అరెస్టులు చేయడం.. టార్గెట్ గా పెట్టుకున్న వారిని ఎలాగోలా కొన్నాళ్లు జైల్లో ఉంచడం అన్నట్లుగా సాగిపోతోంది. తెలంగాణ హైకోర్టులో కూడా ఇలా మార్గదర్శి ఎండీ మీద తప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేసి చీవాట్లు తిన్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close