చంద్రబాబు సాయం వద్దన్న మదనపల్లె రైతు..!

సోనూసూద్ ట్రాక్టర్ సాయం చేసిన మదనపల్లె రైతు నాగేశ్వరరావు.. చంద్రబాబు చేస్తానన్న సాయాన్ని తిరస్కరించారు. నాగేశ్వరరావు ఇద్దరు పిల్లల్లో ఒకరు ఇంటర్, మరొకరు డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి అరక దున్నుతున్న వీడియో వైరల్ అయిన సమయంలో.. చంద్రబాబు కూడా.. ఆ పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటానన్నారు. దాని ప్రకారం.. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆయన కుటుంబానికి లేఖ పంపారు. ఇద్దర్నీ.. గండిపేటలో ఉన్న ఎన్టీఆర్ మహిళా కాలేజీలో రెసిడెన్షియల్ సౌకర్యంతో ఉచితంగా చదివిస్తామని అలా ఇష్టం లేకపోతే.. వారి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని.. సమాచారం పంపారు. అయితే.. ఆ సాయం వద్దని నాగేశ్వరరావు చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఇప్పటికే.. ఏ రాజకీయ నేపధ్యం లేని సోనూసూద్ సాయం తీసుకున్నందుకే.. ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. ఇక నేరుగా.. చంద్రబాబు సాయం తీసుకుంటే… ఇంకెంతగా ప్రచారం చేస్తారని అనుకున్నారేమో కానీ.. ఆయన తిరస్కరించారు. ఏ రాజకీయ పార్టీ సాయాన్ని తాను తీసుకోనని చెప్పారు. నాగేశ్వరరావు… కాస్త చదువుకున్న వ్యక్తే. దళిత ప్రజా సంఘాల్లో పని చేస్తున్న వ్యక్తి. అందరిలాగే ఆయనకు రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి. అయినంత మాత్రాన.. సాయం తీసుకుంటేనే… ఆయనపై రకరకాల ప్రచారాలు చేయడంతో.. అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. చివరికి టీడీపీ సాయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సోనూసూద్ ఎక్కడ చూసి.. ఆ రైతుకు సాయం చేశారో కానీ.. మా మీడియాలో వచ్చింది చూసే.. ఇచ్చారంటూ.. అన్ని మీడియాలు క్లెయిమ్ చేసుకున్నాయి. అందులో సాక్షి కూడా ఉంది. అయితే.. అలా సాయం చేయడంతో.. ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకోలేదన్న ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఇది.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తుందని అనుకున్నారేమో కానీ.. ఆ రైతు పేదవాడు కాదనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక చంద్రబాబు సాయం తీసుకుంటే.. టీడీపీ ముద్ర వేసేయకుండా ఎలా ఉంటారు..? అందుకే.. సాయాన్ని నాగేశ్వరరావు వద్దనుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close