మ‌హేష్ ని జ‌క్క‌న్న ఎలా చూపించ‌బోతున్నాడు?

చిత్ర‌సీమ ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేష‌న్ మ‌హేష్ బాబు – రాజ‌మౌళి. ప‌దేళ్ల క్రితం నుంచీ ఈ కాంబోపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. `చేద్దాం.. చేద్దాం` అని అటు రాజ‌మౌళి, ఇటు మ‌హేష్ చెబుతూనే వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు అది ఓకే అయ్యింది. `మ‌హేష్ తో సినిమా చేస్తున్నా. నా నెక్ట్స్ ప్రాజెక్టు అదే` అంటూ రాజ‌మౌళి చెప్ప‌డంతో మ‌హేష్ అభిమానుల్లో ఆనందం ఉర‌క‌లెత్తుతోంది. అయితే మ‌హేష్‌ని రాజ‌మౌళి ఎలా చూపించ‌బోతున్నాడు, ఎలాంటి క‌థ‌తో రాబోతున్నాడు? అనే ఊహాగానాలు అప్పుడే మొద‌లైపోయాయి కూడా.

ప‌దేళ్ల క్రితం… మ‌హేష్‌, రాజ‌మౌళి కాంబో రావాల్సింది. అప్పుడే వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చలు కూడా జ‌రిగాయి. కానీ మ‌హేష్ త‌న క‌మిట్స్‌మెంట్స్ వ‌ల్ల అప్పుడు చేయ‌లేక‌పోయాడు. ఆ త‌ర‌వాత కూడా సినిమా ఆశ‌లు చిగురించినా, కూర్చుని క‌థ గురించి చ‌ర్చించేంత అవ‌కాశం రాలేదు. కానీ ప‌దేళ్ల క్రితం మహేష్‌కి స్పై థ్రిల్ల‌ర్ వినిపించాడ‌ట‌. జేమ్స్ బాండ్ లాంటి క‌థ అది. అయితే అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా మార్పులొచ్చాయి రాజ‌మౌళి కూడా ఇంటర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్ లో ఆలోచించ‌డం మొద‌లెట్టాడు. తెలుగు మార్కెట్ స్థాయి పెరిగింది. అందుకే అప్ప‌టితో పోలిస్తే ఆ క‌థ‌ని ఇప్పుడు తీయ‌డ‌మే బెట‌ర్‌. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ప్రారంభ ప్రెస్ మీట్‌లో మ‌హేష్ తో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర ఎందుకు చేయించ‌ట్లేదు? అని ఓ పాత్రికేయుడు ప్ర‌శ్నిస్తే – `మ‌హేష్‌ని జెమ్స్ బాండ్ త‌ర‌హా పాత్ర‌లో చూపించాల‌నివుంది` అంటూ ఓ హింట్ కూడా ఇచ్చాడు. సో.. ఈసారి మ‌హేష్ కోసం రాజ‌మౌళి అలాంటి క‌థే రాసి ఉంటాడ‌న్న ఊహాగానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. ఈలోపు రాజ‌మౌళి ఆలోచ‌న‌ల్లో భారీ మార్పులొస్తే త‌ప్ప – మ‌హేష్ తో రాజ‌మౌళి జేమ్స్‌బాండ్ త‌ర‌హా సినిమా తీయ‌డం ఖాయ‌మన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close