మల్లారెడ్డి ఓవరాక్షన్‌తో ఇక ఈడీ కూడా వెంటాడే చాన్స్ !

ఐటీ అధికారులతో మల్లారెడ్డి చేసిన ఓవరాక్షన్ ఆయనను మరిన్ని సమస్యల్లో ముంచే చాన్స్ కనిపిస్తోంది. ఐటీ అధికారులు తాము కనిపెట్టిన అంశాలతో ఈడీకి సమగ్రమైన లేఖ రాశారు. మీరు కూడా ేసులు పెట్టి దర్యాప్తు చేయాలని వారికి సమాచారం పంపారు. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఐటీ అధికారులు పన్నులు ఎంత మేర కట్టలేదో కనుక్కుని ఫైన్ విధించే వరకే ఆలోచిస్తారు. కానీ ఈడీ అధికారులు అలా గాదు.. అక్రమ నగదు తరలింపు జరిగిందని తేలితే.. వెంటనే కేసు పెట్టి.. అరెస్ట్ చేస్తారు.

ఐటీ అధికారులతో మల్లారెడ్డి చాలా దారుణంగా వ్యవహరించారు. వారి ల్యాప్ ట్యాప్‌ను లాక్కోవడంతో పాటు .. వారిపై కేసులు కూడా పెట్టారు. బలవంతంగా సంతాలు పెట్టించుకున్నారని.. తన కుమారుడ్ని కొట్టారని ఆరోపించారు. వంద కోట్ల బ్లాక్ మనీ దొరికిందని సంతకాలు పెట్టించుకున్నారని.. అంత ఎక్కడిదని మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎంత దొరికితే అంతే సంతకాలు పెట్టించుకుంటారు.. ఎక్కువ పెట్టించుకుంటే.. ఆ మొత్తం లెక్క చూపించాల్సింది ఐటీ అధికారులే. అయినా మల్లారెడ్డి అదేమీ పట్టించుకోకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారు.

మల్లారెడ్డిపై ఈడీ కూడా కేసులు నమోదు చేస్తే.. ఆయనకు.. ఆయన వ్యాపార సంస్థలకు కూడా పెద్ద దెబ్బే. తమ ధైర్యం కేసీఆర్ అని.. మల్లారెడ్డి చెబుతున్నారు కానీ.. రేపు ఆయనను ఏ విధంగానూ కేసీఆర్ కాపాడలేరన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ మాటలు విని.. మల్లారెడ్డి ఆశ్చర్యపోయి.. ఐటీ అధికారులపై ఎదురుదాడి చేశారని..ఇప్పుడు వారు తీసుకోబోయే చర్యలను తప్పించుకోవడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close