దీదీ కాన్సెప్ట్ : దేశానికి నాలుగు రాజధానులు..!

ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దీని ప్రకారం మరి 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఎన్ని రాజధానులు ఉండాలి..? . ఈ చర్చ నిన్నామొన్నటిదాకా ఏపీలో… జగన్ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించడానికి జరిగింది. కానీ ఇప్పుడు ఇది దేశవ్యాప్తం అవుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. దేశానికి నాలుగు రాజధానుల అవసరం ఉందని ప్రకటించారు. బెంగాల్లో ప్రస్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన 125 జయంతిని ఎవరికి వారు ఘనంగా నిర్వహించి.. ప్రజల్లో సెంటిమెంటల్ సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగా ప్రధాని మోడీ స్వయంగా బెంగాల్ పర్యటనకు వెళ్లారు. అక్కడో ర్యాలీలో పాల్గొంటున్నారు. మమతా బెనర్జీ కూడా పోటీ ర్యాలీ నిర్వహించింది. అంత వరకూ బాగానే ఉన్నా.. ఆ ర్యాలీలోనే నాలుగు రాజధానులు ప్రస్తావన తెచ్చారు. బ్రిటిష్ వారి హయాంలో దేశం మొత్తం పాలనా కేంద్రం కోల్ కతాలోనే ఉండేదని ఆమె అంటున్నారు. ఇంత సువిశాల భారత దేశాన్ని పరిపాలించడానికి.. ఒక్క రాజధాని సరిపోదని నాలుగు రాజధానులు ఉండాల్సిందేనని అంటున్నారు. నాలుగు చోట్లా… పార్లమెంట్ సమావేశాలు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయాలన్న డిమాండ్ కొన్ని వర్గాల్లో వినిపిస్తూ ఉండేది.

అయితే అది జాతీయ. స్థాయిలో కాదు.. లోకల్‌లోనే . ఇప్పుడు.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటైతే… ఆ నైతిక మద్దతుతో … దేశానికి నాలుగు రాజధానుల డిమాండ్ ను రాజకీయ పార్టీలు వినిపించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు.. ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రంగా ఉండే కోల్ కతాలోనూ ఈ డిమాండ్ మరింత ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. ఇప్పుడే.. మమతా బెనర్జీ ఈ అంశాన్ని టేకప్ చేశారు. ఎంత సీరియస్ గా ముందుగా తీసుకెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close