టీఆర్ఎస్‌పై ఓ రేంజ్ మైండ్ గేమ్..! అరడజను మంది క్యూలో ఉన్నారా..?

రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితి.. ఓ ఇరకాటంలో పెట్టేశారు. రెండు కాదు మూడు వికెట్లు అంటూ సంఖ్య పెంచుచుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డి మాటలు ఆషామాషీ కాదని.. జోరుగా ప్రచారం జరుగుతోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేసం అయిన వెంటనే.. తెలంగాణలో.. ఇక నెక్ట్స్ ఎవరు అన్న చర్చ ఓ రేంజ్‌లో సాగడం ప్రారంభమయింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం… కాంగ్రెస్ లో కన్నా.. టీఆర్ఎస్ లోనే ఎక్కువ కలకలం రేపింది. తమ రాజకీయ భవిష్యత్ పై ఆలోచన చేస్తున్న పలువురు ఎంపీలు… దీనిపై లోతుగా పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో చాలా మంది.. కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలతో టచ్ లో ఉండటం వల్లే… నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి.

చేవేళ్లను ఆనుకుని ఉండే.. నియోజకవర్గానికి చెందిన.. ఓ ఎంపీ చాలా రోజులుగా.. టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఆయన అవడానికి తెలంగాణ వ్యక్తే కానీ… తెలుగు కూడా సరిగ్గా రాదు. ఆయన గతంలోనే పార్టీ మారుతారని ప్రచారం జరగింది. తర్వాత సైలెంటయిపోయారు. అలాగే.. ఇటీవలే.. కేంద్ర దర్యాప్తు సంస్థ వలలో పడిన.. మరో ఎంపీ కూడా.. రెడీ అవుతున్నారని చెబుతున్నారు. అసలు ఆ ఎంపీ.. ఓ మంత్రిపై… అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. చివరి క్షణంలో దర్యాప్తు సంస్థ సోదాలతో వెనక్కి తగ్గారు. ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఉన్న జిల్లాకు చెందిన ఎంపీ కూడా.. అదే బాటలో ఉన్నారని.. తన పాత పరిచయాలతో… రంగంలోకి దిగారంటున్నారు. ఆయన జీవితాశయం మంత్రి కావడం. ఇప్పుడు పోటీ కి చాన్స్ రాకపోవడంతో.. తన కలలు కల్లలయినట్లే. అందుకే… వచ్చిన చోటకే పోదామనుకుంటున్నారట. ఇప్పటికే సీతారామ్ నాయక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయనకు బదులుగా లక్ష్మణ్ నాయక్ అనే కేరళ క్యాడర్ ఐపీఎస్‌కు… ఎంపీ టిక్కెట్ ఇస్తున్నారని కూడా చెబుతున్నారు. ఆయన సీతారామ్ నాయక్ ఖండిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఐదారుగురు ఎంపీలు రెడీగా ఉన్నారని.. అందర్నీ డిసెంబర్ ఏడు లోపు… కాంగ్రెస్ పార్టీలో చేర్చేస్తామని… ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. అయితే.. ఇదంతా కాంగ్రెస్ మైండ్ గేమ్ అనే వాళ్లు లేకపోలేదు. ఎందుకంటే.. టీఆర్ఎస్‌లో ఎంపీలకు కనీస గౌరవం దక్కడం లేదు. వారు అసంతృప్తిలో ఉన్నారు. వారందర్నీ.. పార్టీలో చేర్చుకోవడం వల్ల.. ఆయా ఎంపీలు ఉన్న నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభావం పడుతుంది. అందుకే… కాంగ్రెస్ పార్టీ కూడా.. ఎంపీల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మైండ్ గేమ్ ప్రారంభించింది. మైండ్ గేమ్ లో ఇరుక్కున్న వాళ్లు కాంగ్రెస్‌లో చేరిపోతారు. లేకపోతే…టీఆర్ఎస్‌లోనే ఉంటారు. అంతే తేడా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close