మేధా ఐటి టవర్స్ ని డీ-నోటిఫై చేస్తాం: మంత్రి పల్లె

హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను అన్నిటినీ విజయవాడ తరలించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిలో కొన్నిటి కోసం గన్నవరం సమీపంలో గల మేథా ఐటి టవర్స్ లోకి తరలించాలని భావిస్తోంది. సుమారు 1.7 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆ భవనం అయితే సుమారు 5-6 వేల మంది ఉద్యోగులు పనిచేసుకోవడానికి సరిపోతుంది. ఆ భవనం విజయవాడకి సమీపంలో ఉండటం, అన్ని హంగులతో వినియోగానికి సిద్దంగా ఉండటం వంటి అనేక కారణాల చేత దానిని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అయితే అది ఐటి స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధిలో ఉంది కనుక కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డీ-నోటిఫై చేయవలసి ఉంటుంది. అదీగాక అందులో ప్రస్తుతం మూడు ఐటి కంపెనీలకు చెందిన సుమారు 250 మంది ఐటి ఉద్యోగులు పనిచేస్తున్నారు. కనుక ఆ భవనాన్ని ఉపయోగించుకోవాలంటే ముందుగా ఆ మూడు ఐటి కంపెనీలకి వేరే చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అందుకు ఆ మూడు సంస్థలు అంగీకరించవలసి ఉంటుంది.

ప్రభుత్వం వాటిని విశాఖలో ఐటి పార్క్ కి తరలించాలని భావిస్తోంది. కానీ అవి ప్రస్తుతం ఐటి స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉన్నందున అవి కొన్ని ప్రత్యేక రాయితీలు పొందుతున్నాయి. కనుక వాటిని వేరే చోటకి తరలించాలంటే వాటికి ప్రత్యామ్నాయ కార్యాలయాలతో బాటు రాయితీలను కూడా కల్పించవలసి ఉంటుంది. లేకుంటే అవి బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవచ్చును. ఆ మూడు ఐటి కంపెనీలతో ఎపి.ఐ.ఐ.సి. సంస్థ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే వాటిని వేరే చోటికి తరలించి, డీ-నోటిఫై చేస్తామని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి పల్లె రఘునాధ రెడ్డి తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close