మీడియా వాచ్ : నెంబర్ 1 పేరుతో పరువు తీసుకుంటున్న చానళ్లు !

గత వారం తాము నెంబర్ వన్ అయ్యామంటూ.. టీవీ9 బృందం .. స్క్రీన్ మీదకు వచ్చి చేసిన హడావుడి తర్వాత.. చాలా మందికి వచ్చిన సందేహం ఒక్కటే.. అదేమిటటి.. టీవీ9 ఇప్పటి వరకూ నెంబర్ వన్ కాదా..? అని. నిజానికి సాధారణ ప్రేక్షకులకు ఏది నెంబర్ అనే పట్టింపు ఉండదు. ఈ టీఆర్పీల గోల అంతా చానళ్ల అంతర్గత వ్యవహారం. రేటింగ్ లు ఎక్కువ వస్తే ఎక్కువ యాడ్స్ వస్తాయి. అది వారు చూసుకోవాల్సింది. కానీ జనాలు తమకు ఏ చానల్ నచ్చితే అది చూస్తారు.

టీవ చానళ్లుఈ విషయాన్ని మర్చిపోయి.. తామే నెంబర్ వన్ ప్రజల ముందు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వచ్చిందంటే.. ఎక్కువ మంది ముందుగా టీవీ9 ప్రిఫర్ చేస్తారు. ఇటీవలి కాలంలో పొలిటికల్ బ్రేకింగ్ ల పరంగా.,.. వైసీపీకి వ్యతిరేక వార్తలయితే ఏబీఎన్ , టీవీ ఫైవ్, టీడీపీ వ్యతిరేక వార్తలయితే సాక్షి, ఎన్టీవీ, టీవీ9 వంటి చానళ్లను వర్గీకరించుకుంటున్నారు. ఇతర న్యూస్ అయితే టీవీ9నే చూస్తున్నారు. ఎలా చూసినా ఫస్ట్ ఫ్రిపరెన్స్ టీవీ9 ఉంటుంది. కానీ బార్క్ రేటింగ్ లలో ఎన్టీవీ మొదట ఉంటోంది. ఆ రేటింగ్ లు ఎలా వస్తున్నాయో కానీ .. ఇద్దరూ ఇప్పుడు తామంటే తాము అని.. రోడ్డున పడుతున్నాయి.

ఇటీవల టీవీ9 అతి చేసి ఒక్క వారం.. ఒక్క పాయింట్ ముందు వచ్చినదుకే హంగామా చేశారు. రోడ్లపై పోస్టర్లువేశాు. తీరా చూస్తే ఒక్క వారానికే అదీ కూడా చాలా పన్నెండు పాయింట్ల తేడాతో టీవీ9 వెనుకబడిపోయింది. వారానికోసారి మారిపోయే రేటింగ్ ను చూపించి టీవీ9 సంబారాలు చేసుకుని వారంలో టీవీ9 తలదించుకోవాల్సి వచ్చింది. ఎన్టీవీ కౌంటర్లు వేస్తోంది. అయితే ఈ మీడియా రచ్చ జనానికి అవసరం లేదు. కానీ వీరు దీన్ని కూడా స్క్రీన్ మీదకు తెస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close