చిత్రపురి కాలనీపై కన్నేసిన మంత్రి..!?

సినీ కార్మికుల ఇండ్ల కోసం కేటాయించిన హైదరాబాద్ చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశారా..? తను కోరినట్లుగా ప్లాట్లు ఇస్తే సరేసరి, లేదంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయేలా చేస్తానని బెదిరించారా..? అధికారులు సైతం సదరు మంత్రి ఆదేశాలతోనే రిజిస్ట్రేషన్లను నిలిపివేశారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశారని, తనకు రెండు ప్లాట్లు ఇవ్వాలని సొసైటీ ప్రతినిధులను డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు వారు నిరాకరించడంతో తన అధికారాన్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్లాట్లను అమ్మేందుకు నిర్ణయించారు. కానీ, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వారికి నగదు అందక పెళ్లిళ్లు కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనిపై రిజిస్ట్రేషన్ అధికారులను వారు కలిసి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరని నిలదీస్తే అధికారులు బెదిరిస్తున్నారని టాక్ వస్తోంది.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారికి ఫిర్యాదులు కూడా అందినట్లు సమాచారం. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆయన కూడా ఈ విషయంపై సైలెంట్ అవ్వడం పట్ల అనుమానాలు వస్తున్నాయి. చిత్రపురి కాలనీపై కన్నేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖతో సంబంధం లేదు. అయినా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ శాఖ విషయాల్లో వేలు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం అటు, ఇటుగా చేరి చివరికి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిందని , కొద్ది రోజులుగా లోక్ సభ ఎన్నికల బిజీలో రేవంత్ ఉన్నారు. ఇప్పుడు పాలనపై ఫోకస్ పెడుతామని తాజాగా ప్రకటించడంతో త్వరలోనే ఆయన ఈ అంశంపై ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close