ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య, మానవ వనరుల మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా శనివారం ఐదు రోజుల పాటు అమెరికా, కెనడాలో ఐదు రోజుల పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చేపట్టిన రెండో సారి అమెరికాలో పర్యటిస్తున్నారు. గతంలో పలువురు టెక్ దిగ్గజాలు, మల్లీనేషనల్ కంపెనీల ప్రతినిధుల్ని కలిసి ఏపీలోని అవకాశాలను వివరించారు. ఇప్పుడు కూడా అదే విధంగా పలువురితో సమావేశం కానున్నారు.
టెక్ దిగ్గజాలకు ఏపీలో అవకాశాలపై ప్రజెంటేషన్
పర్యటన ప్రధానంగా అమెరికాలోని డల్లాస్, శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటుంది. శనివారం డల్లాస్ తెలుగు ప్రవాసుల సమాజంతో ఇంటరాక్టివ్ సెషన్ ఉంది. రాష్ట్ర పరిశ్రమల విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని వివరిస్తారు. సుమారు 8,000 మంది ప్రవాసులు లోకేష్ తో ఇంటరాక్టివ్ సెషన్ కోసం నమోదు చేసుకున్నారు. 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కో లో ప్రముఖ టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు ఉన్నాయి. ఉన్నత వృద్ధి రంగాల్లో కొత్త పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు నిర్వహిస్తారు.
కెనడాలోనూ ఏపీలో పెట్టుబడులపై ప్రమోషన్
డిసెంబర్ 10వ తేదీన కెనడాకు వెళ్తారు. టొరంటోలో స్థానిక వ్యాపార నాయకులు, పరిశ్రమల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తారు. కెనడా-ఆంధ్రప్రదేశ్ మధ్య సహకార అవకాశాలను వివరిస్తారు. పంజాబీ-తెలుగు ప్రవాసీ సమాజంతో కలిసి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకురావడం. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో అమెరికన్, కెనడియన్ పెట్టుబడులు. పెంచేందుకు లోకేష్ ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నారు.
యువతకు వైట్ కాలర్ జాబ్స్ కల్పించడమే టార్గెట్
ఏపీ యువతకు స్వరాష్ట్రంలోనే వైట్ కాలర్ జాబ్స్ కల్పించాలని నారా లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏపీని ప్రమోట్ చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పెట్టుబడి హబ్గా మార్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తారు. గత పర్యటనల ద్వారా లోకేష్ మంచి విజయాలు సాధించారు. ఏపీకి గూగుల్ అనే మొదటి అడుగు లోకేష్ పర్యటన ద్వారానే పడింది. ఈ సారి పర్యటన ద్వారా మరిన్ని టెక్ దిగ్గజాలను ఆకర్షించే అవకాశం ఉంది.
