ఆర్టీసీ విలీనం మీద ప్రజల్లో మిశ్రమ స్పందన

ఎట్టకేలకు ఆర్టీసీ ఉద్యోగుల కోరిక నెరవేరింది. ఆర్టీసీ సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విలీనం మీద ప్రజలలో మిశ్రమ స్పందన వస్తోంది. వివరాల్లోకి వెళితే..

ప్రభుత్వ సంస్థగా కాకుండా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సేవలు ఎంతగానో మెరుగైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన కారణంగా, ఆ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగులు ఈ నిర్ణయం పట్ల ఎంతో ఆనందిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది. ఆర్టీసీ సంస్థ నష్టాలు – లాభాలు పక్కనపెడితే, ఆ సంస్థకు ప్రతి ఊర్లో ముఖ్యమైన ప్రాంతంలో స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థలాలు అన్నీ సంస్థ పేరిట కాకుండా ప్రభుత్వం పేరు మీదకు మారుతాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ స్థలాలను వేలం వేసి, ఆర్టీసీ బస్టాండ్ లను వేరే ప్రాంతానికి తరలించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. పైగా ఇక పై ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వినియోగించినా దానికి ఎటువంటి ఫీజులు ప్రభుత్వం చెల్లించవలసిన అక్కర్లేదు. ఇలా రకరకాల కారణాలతో ప్రభుత్వానికి కూడా ఈ విలీనం వల్ల మేలు జరుగుతుంది.

అయితే ఎటొచ్చి ప్రజల్లో మాత్రం ప్రభుత్వ సంస్థగా మారిపోయిన తర్వాత ఆర్టీసీ సేవలు నాసిరకంగా ఉంటాయేమో అన్న అభిప్రాయం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కావడంతో, దాని ఆర్థిక ప్రయోజనాలకు తమ భవిష్యత్తు ముడిపడి ఉండటంతో కాస్తోకూస్తో మంచి సేవలు అందించిన ఈ సంస్థ ఉద్యోగులు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోవడంతో మిగతా ప్రభుత్వ సంస్థ ల ఉద్యోగుల మాదిరిగా నిర్లిప్తంగా మారిపోతారు ఏమోనన్న భయం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

మొత్తం మీద ఇటు వంటి కారణాల చేత, ప్రజలతో ఆర్టీసీ విలీనం పట్ల కాస్త నిర్లిప్తత, మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close