ఆకుల” విమర్శలపై బీజేపీ స్పందించగలదా..?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. దానికి కారణం విభజన హామీలపై దారుణంగా వంచించడమేనని… ఆకుల సత్యనారాయణ తన రాజీనామా కారణాలను స్పష్టంగా చెప్పారు. రాజకీయ భవిష్యత్ కోసమే.. తాను బీజేపీని వీడాల్సి వస్తోందని… అన్యాపదేశంగా అయినా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో .. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంపై మాట్లాడారు. ప్రత్యేకహోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా ప్రతి అంశంలోనూ బీజేపీ అగ్రనాయకత్వం.. ఏపీని వంచించిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేత మొదటిసారిగా…ఈ తరహాలో గళం విప్పారు. ఇంత వరకు.. తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ విమర్శలు చేస్తూంటారు. దీనికి… కౌంటర్‌గా బీజేపీ నేతలు చాలా మాటలు మాట్లాడుతూంటారు. ప్రధాని నుంచి సోము వీర్రాజు వరకు.. చంద్రబాబు వెన్నుపోటుదారుడు అంటూ చెప్పుకొస్తారు కానీ.. విభజన హామీల గురించి మాట్లాడరు. కానీ.. ఇప్పుడు.. సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ తరహా విమర్శలు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌కు భారతీయ జనత పార్టీ అన్యాయం చేసిందేనేది… ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. తాము ఎంతో చేశామని బీజేపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం చేయడం.. రాష్ట్ర ప్రయోజనాలను కూడా… పట్టించుకోకుండా.. సొంత రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నమే. ప్రజల్లో ఏ మాత్రం పట్టు లేని ఏపీ బీజేపీ నేతలు… కేంద్ర ప్రబుత్వం, బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చే పదవులపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఈ కారణంగా వీరు… ఢిల్లీలోని తమ నాయకత్వాన‌్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ.. ప్రజల మనోభావాల్ని వారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం లేదు. ప్రధానమంత్రి మోడీ.. యాప్‌ ద్వారా ఏపీ కార్యకర్తలతో మాట్లాడితే.. మోడీని సంతోష పరిచేందుకు చంద్రబాబును.. ” లుచ్చా.. బెచ్చా..” అని సోము వీర్రాజు లాంటి నేతలు తిట్టారు కానీ.. ఏపీ కి రావాల్సిన విభజన హామీలపై మాత్రం నోరెత్తలేదు. ఇలాంటి రాజకీయ నేతలు ఉన్న పరిస్థితుల్లో.. ఇప్పుడు బీజేపీకి.. ఆకుల సత్యనారాయణ రూపంలో సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు బయటకు వస్తున్నాయి.

ఏపీ బీజేపీలో ఆకుల సత్యనారాయణ రాజీనామా వ్యవహారం కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా గెలిచిన ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేల్లో… ఎవరు పార్టీలో ఉంటారు.. ఎవరు పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీలేదు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వీరు.. తమ పార్టీ అగ్రనాయకత్వం పై కినుకతోనే ఉన్నారు. కానీపార్టీని ఎదిరించలేక పోతున్నారు. అందుకే వీరిలో..అవకాశం ఉన్న వాళ్లు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరిపోతున్నారు. కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు.. టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆరెస్సెస్ నుండి వచ్చిన మాణిక్యాలరావు… పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయరు. కానీ పోటీకి మాత్రం దూరంగా ఉంటారని చెబుతున్నారు. అదే సమయంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, హరిబాబు తాము పోటీ చేయడం లేదని సన్నిహితులకు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఏపీ బీజేపీలో ఆకుల సత్యనారాయణ రాజీనామా సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close