సాక్షి మీడియాపై వేటుకి రంగం సిద్దమవుతోందా?

తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమయిన ఆరోపణలు, అసత్య కధనాలు ప్రచురిస్తున్న సాక్షి మీడియాను స్వాధీనం చేసుకొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. అయినప్పటికీ జగన్ ఏమాత్రం చలించలేదు పైగా సాక్షి మీడియాలో ప్రభుత్వంపై ఇంకా తీవ్రమయిన ఆరోపణలు ప్రచురిస్తోంది. కనుక చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లుగానే సాక్షి మీడియాపై చర్యలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లుంది.

గుంటూరు జిల్లాలోని పొన్నూరు తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఇవ్వాళ్ళ సాక్షి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాపై పొన్నూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు దానిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా అయన తన పిర్యాదులో కోరారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరపున పిర్యాదు చేస్తే దానిని తేలికగా తీసుకోవడానికి కుదరదు కనుక పోలీసులు వెంటనే 12 మందిపై కేసులు నమోదు చేశారు. కనుక ఇక ఈ వ్యవహారంపై కూడా తెదేపా-వైకాపాల మధ్య తీవ్ర వాగ్వాదాలు మొదలవవచ్చును.

వైకాపాకి, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సాక్షి మీడియా కవచకుండలాల వంటివని చెప్పవచ్చును. అవి ఉన్నంత వరకు అతనిని, వైకాపాని నిలువరించడం చాలా కష్టం కనుకనే ప్రభుత్వం ఆ కవచకుండలాలను తీసేసుకొని ఈ రాజకీయ కురుక్షేత్ర రణరంగంలో జగన్మోహన్ రెడ్డిని బలహీనుడిని చేయాలని భావిస్తున్నట్లుంది. ఒకవేళ అదే జరిగితే, అందుకు ప్రభుత్వాన్ని నిందించడం కంటే జగన్ తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అది కూడా స్వయంకృతాపరాధమే కనుక. బలమయిన మీడియా చేతిలో ఉన్నప్పటికీ దానికీ కొన్ని హద్దులు, నియమ నిబంధనలు ఉంటాయనే సంగతిని జగన్ పట్టించుకోకుండా దానిని ఆయుధంగా ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తునందునే ఈ సమస్య తలెత్తుతోంది. కనుక ఒకవేళ సాక్షి మీడియా ఇబ్బందులలో పడితే దానికి జగనే బాధ్యుడనుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close