అక్కడ స్పీకర్ ని తప్పు పడతారు ఇక్కడ తప్పు చేయమంటారు!

వైకాపా ఎమ్మెల్యే రోజా మళ్ళీ ఇవ్వాళ్ళ చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. “గుంటూరు-విజయవాడ ప్రాంతాలలో నేటికీ కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యాపారాలు విచ్చల విడిగా సాగుతున్నాయి. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడే ఒక వివాహిత మహిళను వేధిస్తున్నాడు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుకి ఆడపిల్ల ఉండి ఉంటే ఆడవాళ్ళ కష్టాలు ఏమిటో తెలిసొచ్చేవి. ఆయన ఈ కాల్ మనీ వ్యాపారుల బారి నుంచి భాదిత మహిళలను కాపాడే ప్రయత్నం చేయకుండా, కాల్ మనీ నిందితులను కాపాడుతున్నారు. సాటి మహిళల సమస్యల గురించి శాసనసభలో మాట్లాడినందుకు నాపై కక్ష గట్టి ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయించారు. తెదేపాలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి స్పీకర్ అధికారాలని కూడా దుర్వినియోగం చేయడానికి ఆయన వెనుకాడ లేదు. తెలంగాణా శాసనసభలో తెదేపా సభ్యులు స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అదే తెదేపా ప్రభుత్వం స్పీకర్ అధికారాలను దుర్వినియోగం చేసి, బలవంతంగా ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తుంది.” అని రోజా ఆరోపించారు.

కాల్ మనీ వ్యాపారుల ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయని రోజా చెప్పడం, దానిలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడే ఉన్నాడని చెప్పడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఈ వ్యవహారం బయటపడినప్పుడు పోలీసులు హడావుడిగా కొందరిపై కేసులు నమోదు చేశారు. ఆ తరువాత వైకాపా ఈ సమస్య నుంచి మరో సమస్యకి జంప్ అయిపోవడంతో పోలీసుల హడావుడి కూడా తగ్గింది. అంటే దానర్ధం రాష్ట్రంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యాపారుల ఆగడాలు పూర్తిగా సమసిపోయినట్లు కాదని, ఆ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోయిందని రోజా చెపుతున్న మాటలను బట్టి అర్ధమవుతోంది. కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యను శాస్వితంగా పరిష్కరించవలసి ఉంది. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపితే వైకాపా ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు గట్టిగా పోరాడితే అందరూ హర్షిస్తారు. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close