ఆదివారం ఏపీకి మోడీ..! మొత్తం టూర్ ప్రోగ్రాం.. “పది నిమిషాలు”..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆదివారం గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నారా .. లేదా అన్న అనుమానాల మధ్య ప్రధానమంత్రి పర్యటన ఖరారయింది. అయితే.. పరువు పోకుండా ఉండాలంటే.. వెళ్లక తప్పదన్నట్లుగా.. షెడ్యూల్ ఖరారు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చేది పార్టీ కార్యక్రమాల కోసం కాదు.. లెక్క ప్రకారం అధికారిక కార్యక్రమాల కోసమే.. పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుంటూరులోని ఏటుకూరు దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. మొత్తంగా పది నిమిషాల సేపు .. అంటు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకూ.. అక్కడ ఉంటారు. అందులో మొత్తం.. పది నిమిషాలు కార్యక్రమం. ఐదు నిమిషాల సేపు మాట్లాడటానికి సమయం కేటాయించారు. మిగతా ఐదు నిమిషాల్లో కానీ ఇది రాజకీయ కార్యక్రమం కాదు. షెడ్యూల్ ప్రకారం.. మోడీ కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తున్నారు.

మోడీ శంకుస్థాపన చేయబోయే ప్రాజెక్టులేమిటంటే.. ఎక్కడో… వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నంలో బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్ కు.. ఏటుకూరులో మీట నొక్కి సంకుస్థాపన చేస్తారట. ఆ తర్వాత విశాఖలోని ఓఎన్జీసీకి చెందిన ఓ చిన్న ప్రాజెక్టు, ఐఎస్పీఆర్ఎల్ అనే మరో కేంద్ర సంస్థకు చెందిన మరో చిన్న ప్రాజెక్టుకు ఏటుకూరు నుంచే మీట నొక్కి ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాజెక్టుల గురించి ఐదు నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు. అయితే.. ఇదంతా అధికారికంగా.. మోడీ ఎపీలో ఎంట్రీ ఇవ్వడానికేనని తెలుస్తోంది. పార్టీ పరంగా.. ఓ బహిరంగసభ పెట్టారని.. దాన్ని అధికారికంగా మోడీ షెడ్యూల్ లో చేర్చలేదని చెబుతున్నారు.

అత్యంత లగ్జరీగా తయారు చేయింుకున్న బస్సులో బీజేపీ నేతలు ప్రారంభించిన యాత్రను.. ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు. బస్సుయాత్ర ప్రారంభానికి వచ్చిన అమిత్ షానూ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో.. ఏపీలో నరేంద్రమోడీ పర్యటన ఉంటుందా లేదా.. అన్న చర్చ ప్రారంభించింది. బీజేపీ కూడా దీనిపై పెద్దగా.. ప్రచారం చేయలేదు. కానీ.. మోడీ మాత్రం పది నిమిషాల టూర్ కోసం ఏపీకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close