ఈ సారి అంబాని, అదానీల గురించి మోదీ చెబుతున్నారేంటో !?

ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోడీ గురించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేసే విమర్శల్లో ప్రధానంగా వినిపించేవి.. కనిపించేవి ఆయన కార్పొరేట్ మిత్రులు అంబానీలు..అదానీల గురించిన విమర్శలు. ఈ సారి రాహుల్ వారి గురించి పెద్దగా చెప్పడం లేదు. రిజర్వేషన్ల టాపిక్ పైకి వెళ్లిపోయారు. అయితే వీరి గురించి మోడీ మాట్లాడుతున్నారు. గతంలో అంబానీ, అదానీల గురించి రాహుల్ మాట్లాడేవారని.. కానీ ఇప్పుడు మాట్లాడటం లేదని.. ఎంత నల్లధనం ఇచ్చారని ప్రశ్నించడం ప్రారంభించారు.

ఐదేళ్లుగా విమర్శిస్తూ వచ్చి, ఎన్నికల ప్రక్రియ ఆరంభం కాగానే అదానీ, అంబానీలపై రాత్రికి రాత్రే విమర్శలు ఆపేశారు.. టెంపోల్లో ఎంత నల్లధనం మీకు చేరిందని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. అంబానీ, అదానీలకు నల్లధనం లింక్ పెట్టి మోదీ మాట్లాడటంతో రాహుల్ గాంధీ స్పందించారు. వారు టెంపోలలో డబ్బు కట్టలు పంపిస్తారని మీకు ఎలా తెలుసని.. మీకు అలాగే పంపేవారా అని ఎదురు ప్రశ్నించడం ప్రారంభించారు. అంతే కాదు.. అంబానీ, అదానీ గురించి మొదటి సారి వ్యతిరేకంగా మాట్లాడారని.. ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించింది.

అంబానీ, అదానీలు మోదీకి ఎంత సన్నిహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వారిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి వారిని చర్చనీయాంశం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ఇంత కాలం మోదీకి సపోర్టు చేస్తూ వస్తున్న మీడియాలోనూ కలకలం కనిపిస్తోంది. జీ మీడియా మోదీ కనిపించకుండా బ్యాన్ చేశాయి. అయితే ఆ తర్వాత సంస్థలో అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close