మోదీ ఉపప్రధాని పదవి ఇస్తామన్నారు : కేఏ పాల్

వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఏపీలో 102 సీట్లు వస్తాయని కేఏ పాల్ ప్రకటించారు. గత ఎన్నికల తర్వాత అమెరికా వెళ్లిపోయి మళ్లీ వచ్చే ఎన్నికల కోసం పోటీ చేయడానికి రెండేళ్ల ముందే వచ్చిన కేఏ పాల్ .. ప్రెస్ మీట్లు పెట్టి తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. బీజేపీ తనకు ఉప ప్రధాని పోస్టు ఇస్తానన్నా వద్దని చెప్పేశానన్నారు. లక్షల కోట్ల రూపాయలను ఛారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచి పెట్టానని చెప్పుకున్నారు.

తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని ప్రకటించారు. తన గురించి తాను చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడని కేఏ పాల్.. ప్రపంచంలో నాలాంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేరని స్పష్టం చేశారు. ఆయన ఒక్కరే ఉన్నారని అర్థం. నా ప్రతిభ గురించి తెలిసే మోడీ, కేసీఆర్, జగన్ భయపడతారని ప్రకటించేసుకున్నారు. కేటీఆర్ తనను ప్రత్యర్థిగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తా. ఇప్పటివరకూ 18 పార్టీల నాయకులను కలిపేశాను. ప్రతి ఒక్కరినీ కలుపుకొంటూ పోవాలన్నదే నా అభిమతమన్నారు. అయితే కేఏ పాల్‌ను అందరూ కామెడీగా తీసుకుంటున్నారు. ఆయన మాటలు కూడా అంతే ఉన్నాయి. కానీ పాల్ మాత్రం తన సీరియస్ నెస్ ఏ మాత్రం తగ్గకుండా.. పొలిటికల్ కామెడీ చేస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

కడప వాసుల్లో సునీత పోరాటానికి పెరుగుతున్న మద్దతు !

రాజకీయాల్లో భయ పెట్టి అందర్నీ తమ వెనుక నడిపించుకోవడం కన్నా...సానుభూతి అనేది ఎక్కువ బలమైనది. ప్రజల సానుభూతి పొందితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడప జిల్లాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close