మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను ప్రధాని. రాజ్యాంగపరమన బాధ్యతల ప్రకారం .. ఏపీకి సహకరించడం వరకే. అంతే తప్ప జగన్ రెడ్డిని మోడీ ఎప్పుడూ మిత్రుడిగా చూడలేదు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా చెప్పారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో మోదీ ఈ విషయాన్ని సూటిగా.. సుత్తి లేకుండా తేల్చి చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి తన పార్టీ విధానాలకు అనుగుణంగా ఉన్నాయనే తాము ప్రతిపాదించిన బిల్లులకు మద్దతిచ్చారని మోదీ భావన. అయితే జగన్ రెడ్డి బీజేపీకి ఐదేళ్ల పాటు సహకరించడానికి కారణం మాత్రం ఆయనకు తెలుసు.. ప్రజలకు తెలుసు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటికీ బీజేపీని కానీ మోదీని కానీ పల్లెత్తు మాట అనే ధైర్యం చేయలేకపోయారు. అది ఆయన పరిస్థితి.

ఏపీలో పరిస్థితి ఘోరంగా ఉందని.. జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచే అవకాశం లేదని మోదీ భావన. మళ్లీ గెలవడం అంటే.. ఇప్పుడే కాదు.. ఇంకెప్పుడూ సాధ్యం కాదని ఆయన అనుకుంటున్నారు. బీజేపీ.. టీడీపీ కూటమితో చేరడానికి ఇదే నమ్మకం కావొచ్చు. టీడీపీతో కలవకుండా జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఆపడానికి చేయని ప్రయత్నాలే లేవు. చివరికి తాము ఎన్డీఏలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ చేర్చుకోలేదని అంటున్నారు. జగన్ పై మోదీ అభిప్రాయం తెలిసిన తర్వాత అందులో ఆశ్చర్యం ఏమీ లేదని రాజకీయవర్గాలు కూడా అనుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close