“అఖండ కశ్మీరం” విలీనంపై భారత్ సర్కార్ గురి..!

కశ్మీర్‌లో 370 అధికరణ రద్దుతో వచ్చిన ఉత్సాహమేమో కానీ.. భారత హోంమంత్రి అమిత్ షా సమరోత్సాహంతో ఉన్నారు. పాకిస్థాన్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లోని కొంత భాగం… ఇండియాదేనని.. ప్రకటించారు. అలాగే చైనా కంట్రోల్‌లో ఉన్న అక్సాయ్‌చిన్ ప్రాంతం కూడా కశ్మీర్‌లో భాగమేనని షా ఉద్ఘాటించారు. పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ .. పీవోకేగా… అది చెలామణి అవుతోంది. భారత్ – పాకిస్తాన్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్.. ఎల్‌వోసీ.. నియంత్రణ రేఖ ఉంటుంది. భారత అధీనంలో ఉన్న కశ్మీర్‌ను.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను విడదీసే రేఖ ఇది. ఇది దాదాపుగా 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రేఖకు ఇవతలివైపున ఉన్న ప్రాంతం మనం జమ్ముకశ్మీర్‌గా వ్యవహరిస్తున్న భూభాగం. మొత్తం కశ్మీరంలో ఇది కేవలం 45 శాతం మాత్రమే. అలాగే.. పూర్తి కశ్మీర్‌లోని దక్షిణ, తూర్పు భాగాలు ఇవి.

రేఖకు ఆవలి భూభాగం పాకిస్థాన్‌ ఆక్రమించిన కశ్మీర్‌ ఉంటుంది. అందులో మూడు ప్రధాన భాగాలున్నాయి. అవి.. ఆజాద్‌ కశ్మీర్‌, గిల్గిట్‌, బాల్టిస్థాన్‌. మొత్తం కశ్మీరంలో 35 శాతం భాగమైన ఈ ప్రాంతంలో కశ్మీర్‌ ఉత్తర, పశ్చిమ భాగాలున్నాయి. మొత్తం కశ్మీరంలో 45 శాతం భూభాగం జమ్ముకశ్మీర్‌ కాగా.. 35 శాతం భూభాగం పీవోకే. అంటే.. 80 శాతం. 20 శాతం అక్సాయ్‌చిన్‌ ప్రాంతం ఇది. ఇది చైనా అధీనంలో ఉంది. కశ్మీర్‌లోని ఈశాన్య భూభాగం ఇది. ఈ ప్రాంతంలో భారత్ కు చైనాకు మధ్య ఉన్న సరిహద్దు రేఖనే వాస్తవాధీన రేఖ … లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ అని పిలుస్తున్నారు.

ఇప్పుడు పార్లమెంట్ వేదికగా.. అమిత్ షా… అటు పాకిస్థాన్‌కు.. ఇటు చైనాకు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. అఖండ కశ్మీరాన్ని భారత్‌లో కలిపేసుకునేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని.. అమిత్ షా సందేశంలోపంపారు. పీవోకే, ఆక్సాయ్‌చిన్‌ కూడా జమ్ముకశ్మీర్‌లో భాగమేనని తేల్చిచెప్పారు. త్వరలో వాటిని కలిపేసుకోవడానికి అవసరమైన చర్యలు.. మోడీ , షా సూపర్ జోడి.. చేపట్టే అవకాశాలున్నాయని… పార్లమెంట్‌ ద్వారా సందేశం వెళ్లింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close