మోడీ వ్యూహాత్మక ఎదురు దాడి

బీహార్లో తాడో పేడో తేల్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. ఢిల్లీ ఫలితం పునరావృతం కాకుండా చూడటానిని పత్రయపడుతున్నారు. మంగళవారం భాగల్పూర్ సభలో ఆయన చేసిన ప్రసంగం, ఈ విషయం స్పష్టం చేస్తోంది. మొన్న పాట్నా స్వాభిమాన్ ర్యాలీలో లాలు, నితీష్, సోనియా గాంధీలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. దీనికి మోడీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

తాను లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగటానికి ఇవి లోక్ సభ ఎన్నికలు కాదు అసెంబ్లీ ఎన్నికలని గుర్తు చేశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరు గురించి ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. తద్వారా, ఎన్నికల ప్రచారంలో కేంద్రం గురించి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించే చర్చ జరగాలన్న ఎజెండాను ఫిక్స్ చేశారు. 2015లో ప్రతి ఊరికీ విద్యుత్ సరఫరా చేయకపోతే ఓటు అడగనని అప్పట్లో నితీష్ కుమార్ శపథం చేశారు. ఇప్పుడు దాని గురించే మోడీ ప్రశ్నిస్తున్నారు. అన్న మాట ప్రకారం ప్రతి ఊరికీ కరెంటు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ బీహార్ లో చాలా గ్రామాలకు కరెంటు సరఫరా జరగడం లేదు. అలాంటప్పుడు నితీష్ ఓటు ఎలా అడుగుతారని నిలదీయండి అంటూ బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

బీహార్లో ఇప్పటికీ చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఇతర మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. పాతికేళ్లుగా లాలు, నితీష్ జమానాలో బీహార్ ను ఏం ఉద్ధరించారని మోడీ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలను ఆలోచింపచేయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థులపై ఊరికే విమర్శలు చేయడం కాకుండా ఇలా పాయింట్ల వారీగా ఎదురు దాడి చేయడం కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రత్యర్థులను డిఫెన్స్ లోకి నెట్టడానికి మోడీ ప్రయత్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close