ఓటుకు నోటు కేసులో త్వరలో మరికొన్ని పెద్ద తలకాయలు అరెస్ట్?

ఓటుకు నోటు కుంభకోణం కేసులో దూకుడు పెంచాలని తెలంగాణ ఏసీబీ నిర్ణయించింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టు చివరిది కాదని ఏసీబీ వర్గాలు తెలిపాయి. తెలుగు దేశం పార్టీకి చెందిన కనీసం ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలను విచారణకు పిలిచి అరెస్టు చేయడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఏసీబీ అరెస్టు చేయబోయే వారిలో ప్రముఖ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రెండు మూడు రోజుల్లో నోటీసు ఇవ్వాలని కూడా ఏసీబీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ కేసులో వీలైనంత ఉచ్చు బిగించాలని రాష్ట్ర్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఇప్పటికీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు నోటీసు ఇవ్వాలని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి తీవ్రనిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడకూడదని ఏసీబీకి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఎమ్మెల్యే సండ్రను ఏడుగంటల పాటు విచారించిన తర్వాత ఏసీబీ అరెస్టు చేసింది. మొదటిసారి విచారణకు పిలిచనప్పుడు ఆయన రాకపోయినా, పదిరోజులు ఆలస్యంచేసినా ఏసీబీ ఒపిక వహించింది. ఆయన తనంత తానుగా వచ్చిన తర్వాతే అరెస్టు చేసింది.

మరో ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేల విషయంలో్నూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తారని సమాచారం. ముందు విచారణకు పిలిచి, తర్వాత అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. ముగ్గురు ఎంపీలో ఒకరు కీలక స్థానంలో ఉన్న నేత అని సమాచారం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వదలకూడదని ప్రభుత్వం పట్టుదలతో ఉందని భోగట్టా. రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు ప్రయత్నం విఫలం కావడంతో మిగతా అనుమానితులపై ఏసీబీ దృష్టి పెట్టింది.

ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. అయితే, దాని దగ్గర ఆధారాలు ఏమీ లేవని తెరాస నేతలు చెప్తున్నారు. ఊరికే తాటాకు చప్పుళ్లలా ప్రకటనలు చేయడం తప్ప వారు ఏమీ చేయలేరనే ధీమా గులాబీ శిబిరంలో కనిపిస్తోంది. టీడీపీ నేతలు మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఆషామాషీ విషయం కాదని, ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరుకున పెడుతుందని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సహకరించాలంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు మొబైల్ సర్విస్ ప్రొవైడర్లకు రాసిన లేఖలు లభించాయని, దీంతో తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ధీమాగా చెప్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close