తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్నో ట్విస్టులు : కవిత

తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీల్లోని కీలక వ్యక్తులు ఎవరు ఏం మాట్లాడినా… దాని వెనుక ఉన్న అర్థమేమిటా అని వెదుక్కోవడం ప్రారంభమయింది. తాజాగా.. జగిత్యాలలో పర్యటించిన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సమీకరణాలు మారుతాయని… రాజకీయాలు ఆసక్తికరంగా మారుతాయని వ్యాఖ్యానించారు. ఏది జరిగినా టీఆర్‌ఎస్‌కే మంచి జరుగుతుందని.. అనేక అంశాలు చర్చకు వస్తాయని ప్రకటించారు.

కవిత అంతకు మించి ఎక్కువ వ్యాఖ్యలు చేయలేదు.. కానీ అందులోనే చాలా పరమార్థం ఉంది. అదేమిటన్నది టీఆర్ఎస్ నేతలకే అంతుబట్టడం లేదు. ఈటల రాజేందర్ నిష్క్రమణ తర్వాత టీఆర్ఎస్‌లో బీసీ నేతల చేరికలకు కేసీఆర్ వ్యూహం పన్నారు. అందులో భాగంగా ఎల్.రమణను ఆహ్వానిస్తున్నారు. అయితే… ఇదే చివరి ట్విస్ట్ కాదని.. ఇంకా చాలా చాలా జరగబోతున్నాయని కల్వకుంట్ల కవిత నేరుగానే చెప్పేశారు. ఆ చాలాచాలా ఏమిటనేదే ఇప్పుడు ఆసక్తికరం.

కేటీఆర్‌కు పీఠం అప్పగించే వ్యూహంలో భాగంగా కేసీఆర్ తోక జాడించే వారినందర్నీ మెల్లగా నిర్వీర్యం చేస్తున్నారన్న అభిప్రాయం ఒకటి ఉంది. ఆ క్రమంలో తర్వాతి పేరు జగదీష్ రెడ్డిదిగా కొంత కాలంగా ప్రచారం లో ఉంది. అయితే ట్విస్టులు అంతటితో ఆగే చాన్స్ లేదు. ఇటీవలి కాలంలో కవిత పేరు కూడా తరచూ ప్రచారంలోకి వస్తోంది. ఆమెకు కూడా కీలకమైన పదవి దక్కబోతోందని అంటున్నారు. ఈ క్రమంలో కవిత చెబుతున్న రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయోనన్న చర్చలు సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close