మోత్కుపల్లికి గవర్నర్ పదవి?

తెలంగాణాలో తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకి గవర్నర్ పదవి ఇప్పిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేరు. ఆ విషయం మోత్కుపల్లి స్వయంగా గత మహానాడు సభలో బయటపెట్టారు. ఆ హామీ త్వరలో నెరవేరే సూచనలున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అభ్యర్ధన మేరకు కేంద్రప్రభుత్వం మొత్కుపల్లిని దక్షినాది లేదా ఈశాన్య రాష్ట్రాలలో దేనికో ఒక దానికి కొత్త సంవత్సరంలో గవర్నర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెదేపా నేతలు చెపుతున్నారు. మళ్ళీ చాలా కాలం తరువాత ఈ అంశం తెర మీదకు వచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదు కనుక బహుశః ఈ వార్త నిజమేనని భావించవచ్చును. అదే నిజమయితే మోత్కుపల్లి దశ తిరిగినట్లే భావించవచ్చును.

తెలంగాణాలో తెదేపా పరిస్థితి ప్రతీ ఎన్నికలతో మరింత దిగజారుతోంది. ఈరోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో తెదేపా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు, తెరాస నాలుగు స్థానాలు దక్కించుకొన్నాయి. త్వరలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒకవేళ వాటిలో కూడా తెదేపా తన సత్తా చాటుకోలేకపోయినట్లయితే, ఇక తెలంగాణాలో తెదేపా క్రమంగా తన ఉనికిని కోల్పోవడం తధ్యమనే చెప్పవచ్చును. ఈ నేపధ్యంలో మోత్కుపల్లి నరసింహులుకి గవర్నర్ పదవి లభిస్తే, ఆయన పార్టీ పరిస్థితులతో సంబంధం లేకుండా హాయిగా కాలం వెళ్ళదీసేయవచ్చును. కానీ పార్టీలో మిగిలిన వారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close