పోలీసు వలయాల మధ్య ముద్రగడ నిరాహార దీక్ష

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్ది సేపటి క్రితం కిర్లంపూడిలో తన భార్య పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్నారు. ఆయన దీక్షకు కూర్చొనే ముందు జిల్లా పోలీస్ సూపరిండెంట్ రవి ప్రకాష్ ఆయనను కలిసి దీక్ష వలన జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని కనుక ఆ ఆలోచన విరమించుకోవాలని అభ్యర్ధించారు. కానీ ఆయన దానిని మన్నించలేదు. తన తరపు నుండి ఎటువంటి సమస్యలు ఎదురవవని హామీ ఇచ్చి దీక్షకు కూర్చొన్నారు. ఆయన తునిలో కాపు గర్జన సభ నిర్వహిస్తున్నప్పుడు ఉపేక్షించిన పోలీసులు ఈసారి చాలా బారీ భద్రత ఏర్పాట్లు చేసారు.

కిర్లంపూడికి చేరుకొనే అన్ని మార్గాలలో తుని, తొండంగి, కోనందూరు, తేటగుంట, కత్తిపూడి తదితర ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బారీగా పోలీసులను మొహరించారు. వెయ్యి మంది పారా మిలటరీ సిబ్బంది, 700 మంది పోలీసులు మొహరింపబడ్డారు. వారిని 200 మంది ఏ.ఎస్సైలు, 50మంది ఎస్సైలు, 24 మంది సిఐలు, 6 మంది డిఎస్పిలు పర్యవేక్షిస్తున్నారు.

ఆ భద్రతా ఏర్పాట్లతో కిర్లంపూడిని ఒక కోటగా మార్చేసారు. ఇప్పుడు ఎవరూ అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. బహుశః అందుకు మళ్ళీ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించవచ్చును. దీక్షా స్థలానికి ఎవరూ చేరుకోకుండా కట్టుదిట్టమయిన ఏర్పాట్లు చేయడంతో ఆయన ఏకాకి అయిపోయినట్లు అయింది. తనకు మద్దతు తెలిపేందుకు ఎవరూ రావద్దని ముద్రగడ పద్మనాభం స్వయంగా కోరడంతో ఇక ప్రభుత్వాన్ని, పోలీసులను నిందించవలసిన అవసరం లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close