దీక్ష విరమించిన ముద్రగడ దంపతులు!

హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలంటూ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ దంపుతులు తమ ఆందోళనను ఎట్టకేలకు విరమించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. టీడీపీ ప్రభుత్వ ప్రతినిధులుగా ఇవాళ ఉదయం కిర్లంపూడి వచ్చిన కళావెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు ముద్రగడతో గంటకుపైగా జరిపిన చర్చలు ఫలించాయి.

తర్వాత కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కాపు కార్పొరేషన్‌కు ఈ ఏడాది రు.500 కోట్లు, వచ్చే బడ్జెట్‌లో రు.1,000 కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు కళావెంకట్రావు తెలిపారు. కాపు కార్పొరేషన్ నివేదిక 9 నెలల్లోపే వచ్చే అవకాశముందని చెప్పారు. ముద్రగడ సూచించిన ఒక వ్యక్తికి మంజునాథ్ కమిషన్‌లో సభ్యుడిగా నియమిస్తామని తెలిపారు. అమాయకులపై కేసులు పెట్టకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కాపు కమిషన్ ముందున్న దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేస్తామని చెప్పారు. కాపుల ఆకలిని తీర్చాలనే రోడ్డెక్కానని ముద్రగడ చెప్పారు. రిజర్వేషన్లు ఆలస్యం కావటంతో దీక్ష చేపట్టానని అన్నారు. బీసీలకు అన్యాయం జరగాలని తాను కోరుకోవటం లేదని చెప్పారు. ఉద్యమానికి సహకరించినవారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తనతోపాటు నిరాహారదీక్షలు చేస్తున్నవారందరూ దీక్షను విరమించాలని సూచించారు. తన దీక్షకు మద్దతిచ్చిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, దాసరిలకు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు, లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు వయసు మీద పడిందని, మళ్ళీ రోడ్డెక్కేలా చేయొద్దని ముఖ్యమంత్రిని కోరారు. తాను ఏమైనా అభ్యంతరకరంగా మాట్లాడిఉంటే క్షమించాలని ముద్రగడ అన్నారు.

Mudragada-fast-called-off

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close