నాల్గవ రోజుకి చేరిన ముద్రగడ నిరాహార దీక్ష

కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం దంపతులు మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో నాల్గవ రోజుకి చేరుకొంది. ఆయన వైద్య పరీక్షలు కూడా చేయించుకోవడానికి నిరాకరిస్తూ తన ఇంటి తలుపులు మూసుకొని తమ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన అనుచరులు ఎవరినీ లోపలకి రానీయకుండా అడ్డుకొంటున్నారు. దానివలన ముద్రగడ దంపతుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనే అవకాశం లేకుండా పోయింది. దీక్ష మొదలుపెట్టిన రెండవ రోజుకే వారి షుగర్ లెవెల్స్ తగ్గడం మొదలయింది కనుక ఇప్పటికి ఇంకా తగ్గి ఉండవచ్చును. దాని వలన వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షలకి సహకరించాలని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరిండెంట్ చేసిన విజ్ఞప్తులను ఆయన త్రోసిపుచ్చి నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఇంకా ఆలస్యం అయితే వారి పరిస్థితి విషమించే అవకాశం ఉంది కనుక నేడోరేపో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేయవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close