ముఖేష్ అంబానీ… టాప్ టెన్‌లో లేరు..!

ప్రపంచ కుబేరుల సంపద… కరోనా దెబ్బకు కరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా పేరు పొందిన వారి ఆస్తులు.. కళ్ల ముందే తగ్గిపోతున్నాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుడు.. ప్రపంచంలో టాప్ టెన్‌ కుబేరుల్లో ఒకరిగా కిరీటం దక్కించుకున్న ముకేష్ అంబానీకి ఇప్పుడు.. ఆ హోదా లేదు. కరోనా కారణంగా కరిపోతున్న ఆర్థిక వ్యవస్థలు.. స్టాక్ మార్కెట్ల కారణంగా..ఆయన సంపద… తగ్గిపోయింది. గత నెల వారాల కాలంలో ఆయన రూ. లక్షా నలభై వేల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో ఆయన స్థానం ప్రపంచ కుబేరుల జాబితాలో 9 నుంచి పదిహేడో జాబితాకు చేరింది. ప్రస్తుతం ఆయనకు రూ. మూడునన్నర లక్షల కోట్ల సంపద ఉండవచ్చని అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ హురూన్ అంచనా వేసింది.

అయితే.. దేశంలో ఆయన తిరుగులేని కుబేరునిగానే సాగుతున్నారు. ఎందుకంటే.. ఆయనతో పోటీగా ఉన్న బిజినెస్ కింగ్‌ల వ్యాపారాలు కూడా తగ్గిపోయాయి. నిజం చెప్పాలంటే.. అంబానీ కంటే ఎక్కువ నష్టపోయిన వాళ్లు ఉన్నారు. ఆదానీ గ్రూప్ ఓనర్ గౌతం అదానీ ముఖేష్ కన్నా ఎక్కువ సంపద పోగొట్టుకున్నారు. ఆయన సంపద 6 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. ఇక హెచ్‌సీఎల్‌ టెక్‌ శివ్‌ నాడార్‌ 5 బిలియన్‌ డాలర్లు, కోటక్ గ్రూప్‌నకు చెందిన ఉదయ్‌ కోటక్‌ బిలియన్‌ డాలర్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్ సంపద మొత్తం యాభై శాతం వరకూ కరిగిపోయింది కాబట్టి.. వీరి సంపదంలో ఈ మాత్రం తేడా రావడం సహజమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే.. ఈ కుబేరులకు వచ్చిన ఈ నష్టంతో… వారికి పోయేదేమీ లేదు. ఈ సంపద కరిగిపోవడం పూర్తిగా స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. రేపు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారన్న విషయం బయటకు రాగానే.. ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా ఊపందుకుంటాయి. అదేజరిగితే.. ఈ కుబేరుల సంపద.. ఇప్పుడు కోల్పోయిన దాని కన్నా.. రెండింతలు పెరుగుతుంది. అయితే.. ఈ కరోనా వల్ల.. ఆయా సంస్థల వ్యాపార, ఆర్థిక వ్యవహారాలు దెబ్బతింటేనే కోలుకోవడం కష్టం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close