టీవీ 5 చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్గా మూర్తికి ప్రమోషన్ ఇచ్చారు. టీవీచానల్ నిర్వహణ మొత్తం మూర్తి చేతుల్లోనే పెట్టారు. తెలుగులో టాప్ చానళ్లలో టీవీ5 ఒకటి. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కుమారులు ఇద్దరు వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు. టీవీ చానల్ నిర్వహణ కూడా వారే చూస్తారు. అయితే ప్రొఫెషనల్ జర్నలిస్టు చేతుల్లో ఉంటే మంచిదని అనుకున్నారేమో కానీ.. మూర్తికి సీఈవో పోస్టు ఇచ్చారు.
మూర్తి ఈనాడు నుంచి తన జర్నలిజం కెరీర్ ప్రారంభించారు. దినపత్రికలో విజయవాడ నుంచి సంచలన కథనాలు అందించి టాప్ జర్నలిస్టులలో ఒకరిగా నిలిచారు. టీవీ మీడియా వచ్చాక టీవీకి మారారు. ఈటీవీ2 కోసం పని చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. అయితే ఎలక్ట్రానిక్ మీడియా విజృంభణతో ఆయన దూకుడైన జర్నలిజానికి ఈటీవీ2 సరిపోలేదు. దాంతో చానళ్లు మారారు. ఎన్టీవీ, ఏబీఎన్లో చాలా కాలం పని చేశారు.
తర్వాత మహాటీవీకి వెళ్లారు. చివరికి టీవీ5లోకి వచ్చారు. తప్పుల్ని ప్రశ్నించడానికి ఏ మాత్రం భయపడని మనస్థత్వం ఉన్న మూర్తి .. జర్నలిజం విలువలకు పూర్తిగా కట్టుబడ్డారు. ఆయనపై కోపంతో ఇతరులు చేసే ఆరోపణలు అన్నీ అవాస్తవాలే. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఎవరి దగ్గరా రూపాయి తీసుకోరు. అలాంటి నిఖార్సైన జర్నలిస్టు చేతిలో టీవీ5 ఉండటం వల్ల ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది.