‘అల వైకుంఠపురములో’ హీరో – హీరోయిన్ల క్యారెక్టర్లని బాగా డిజైన్ చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా విజయవంతం అవ్వడంలో వాళ్ల కెమిస్ట్రీ బాగా ఉపయోగపడింది. `మేడమ్.. మేడమంతే.. `అంటూ బన్నీ – పూజా వెంట పడడం బాగా వర్కవుట్ అయ్యింది. హీరోయిన్ ని ఓ స్టార్ హీరో `మేడమ్.. మేడమ్`అంటూ వెంట పడడం ఇవన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఇదే థియరీ.. `గీత గోవిందం`లోనూ కనిపించింది. అక్కడ కూడా.. హీరోపై, హీరోయిన్ దే అప్పర్ హ్యాండ్. `మేడమ్… మేడమ్` అంటూ విజయ్ దేవరకొండ… రష్మిక వెంట పడడం భలే క్యూట్ గా అనిపించింది.
ఇప్పుడు పరశురామ్ మళ్లీ అదే ఫార్ములాలోకి వెళ్తున్నాడు. ఈసారి కూడా హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీపై గట్టిగా గురి పెట్టినట్టు సమాచారం. పరశురామ్ ప్రస్తుతం నాగచైతన్య కోసం ఓ కథ సిద్ధం చేశాడు. `నాగేశ్వరరావు` అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇది మిడిల్ క్లాస్ కథ. చైతూని మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించబోతున్నాడు. అందుకు పూర్తి విభిన్నంగా… హీరోయిన్ ని గొప్పింటి బిడ్డగా, ఓ కంపెనీ సీఈఓగా తీర్చిదిద్దాడట. అదే కంపెనీలో హీరోని ఉద్యోగిగా మార్చేశాడు. దాంతో ఇక్కడ కూడా `మేడమ్.. మేడమ్` అంటూ హీరోయిన్ వెంట పడడమే.. రిపీట్ అవ్వబోతోంది. కాకపోతే… హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. ఓ స్టార్ హీరోయిన్ని తీసుకొస్తే తప్ప… అల వైకుంఠపురం, గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో చూడాలి.