పవన్ ఫ్యాన్స్‌పై మండిపడ్డ నాగబాబు

హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. నిన్న చిరంజీవి జన్మదిన వేడుకల కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మెగా హీరోల కార్యక్రమాలన్నింటిలో పవన్, పవన్ అంటూ నినాదాలు చేస్తూ కొందరు అభిమానులు అంతరాయం కలిగించటం, ఇది చిరంజీవితోసహా అందరికీ ఇబ్బంది కలిగించటం తెలిసిందే. నిన్నకూడా అలాగే పవన్ గురించి నినాదాలు చేస్తున్న అభిమానులపై నాగబాబు మండిపడ్డారు. పవన్ రాకపోతే తామేం చేయాలని ప్రశ్నించారు. అన్ని కార్యక్రమాలకూ పవన్‌ను ఆహ్వానిస్తూనే ఉన్నామని, అతను రావటంలేదని చెప్పారు. అంతగా అడగాలనుకుంటే, అంత దమ్ముంటే ఈ విషయాన్ని వెళ్ళి పవన్‌నే అడగాలని తీవ్రస్వరంతో హెచ్చరించారు. పవన్ రాకపోవటంపై ప్రతిసారీ తాము సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తోందని చెప్పారు. నాగబాబు ఈ హెచ్చరిక చేస్తున్నపుడు చిరంజీవితో సహా మెగా కుటుంబమంతా వేదిక కిందే ఉంది.

చిరంజీవి సినిమారంగంనుంచి తప్పుకోవటం, పవన్‌కు వరుస బంపర్ హిట్‌లు రావటంతో ఇప్పుడు మెగాస్టార్‌కంటే పవర్‌స్టార్‌కి పాపులారిటీ అనూహ్యంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అదే మెగా హీరోల కార్యక్రమాలలో అభిమానుల నినాదాలరూపంలో ప్రతిఫలిస్తోంది. దానిని చిరంజీవికూడా జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయా సందర్భాలలో ఆయన ముఖకవళికలలలో స్పష్టంగా కనబడుతున్న విషయం తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close