మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన వివాదాస్పదం అవుతుండగా తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారితీస్తోంది.

వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడంపై సోమవారం ఓటు వేసిన అనంతరం అల్లు అర్జున్ స్పందించారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రావిచంద్రారెడ్డి తన స్నేహితుడు అని, అందుకే ఆయన మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నానని స్పష్టత ఇచ్చిన అల్లు అర్జున్, తనకు రాజకీయాలతో సంబంధం లేదని, నా అనుకున్న వాళ్ళకు తప్పకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం సోమవారం ఓటింగ్ ముగిసిన తర్వాత నాగబాబు ట్విట్టర్ లో స్పందించిన తీరు చర్చనీయాంశం అవుతోంది.

“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!,” అని పోస్ట్ చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి నాగబాబు పోస్ట్ చేశారో కాని, అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ – కొణిదెల కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగబాబు పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ కు మద్దతుగా రామ్ చరణ్, అతని తల్లి సురేఖ పిఠాపురం వెళ్లి పవన్ ను కలిసిన రోజే అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించడం ఫ్యామిలీలో చిచ్చు రాజేసిందన్న టాక్ నడుస్తోంది. పైగా ప్రచారంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తనను ప్రచారానికి ఎవరూ పిలవలేదని, తనే వచ్చానని వ్యాఖ్యానించడం మెగా ఫ్యామిలీకి మింగుడు పడలేదని.. అందుకే ఆగ్రహంతోనే నాగబాబు తాజాగా ట్వీట్ చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే, పిఠాపురంలో పవన్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొనని అల్లు అర్జున్ నంద్యాల మాత్రం వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా ప్రచారం చేయడం పట్ల బన్నీపై ఆగ్రహమే నాగబాబు ట్వీట్ సారాంశమని ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close