నాగ్ మార్కెట్ అంతేనా?

నాగార్జున కెరీర్ మరీ ఒడిదుడుకుల్లో ఏమీ లేదు. ఆఫీసర్ సినిమాను పక్కన పెడితే మరీ భయంకరమైన డిజాస్టర్లు కూడా లేవు. అయినా మార్కెట్ మాత్రం అంతంత మాత్రమే అన్నది బయ్యర్ల పాయింట్. అందుకే నాగ్ లేటెస్ట్ సినిమా ‘మన్మధుడు 2’ ను ఆంధ్ర ఏరియాకు జస్ట్ ఏడు కోట్ల రేషియోలో ఇచ్చేసారు. ఆంధ్రలోని కృష్ణ, వైజాగ్ ఎలాగూ స్వంత విడుదలే.

నాని, విజయ్, శర్వా లాంటి యంగ్ హీరోల మార్కెట్ ఆంధ్రలో పది కోట్ల వరకు వుంది. అలాంటిది రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత, నాగ్ ఎవర్ గ్రీన్ హిట్ మన్మధుడు సిరీస్ లో సినిమా అన్న టాక్, మంచి టీజర్, ట్రయిలర్ అన్నీ వున్నా, ఏడు కోట్ల రేంజ్ లోనే ఇవ్వాల్సి వచ్చింది.

ఆఫ్ కోర్స్ దీన్ని నాగ్ మరో విధంగా కవర్ చేసుకున్నాడు. సినిమా ట్రయిలర్ విడుదల ఫంక్షన్ లో తానే తక్కువ రేట్లకు ఇవ్వమన్నానని, నిర్మాతే కాదు, బయ్యర్లు కూడా బాగుండాలని చెప్పుకొచ్చాడు.

అయినా ఈ మధ్య నిర్మాతలు కాస్త తక్కువకు ఇవ్వడం అన్న స్ట్రాటజీ కూడా తీసుకున్నది వాస్తవం. ఎక్కువకు ఇచ్చి, సినిమా డిజాస్టర్, బయ్యర్లు మునిగిపోయారు అన్న టాక్ వెంటనే బయటకు రావడం, దాంతో సినిమాకు మరింత నెగిటివ్ కావడం జరుగుతోంది. అదే కాస్త తక్కువకు ఇచ్చి, ఏదో విధంగా ఓవర్ ఫ్లోస్ రాబట్టుకుంటే బెటర్ అని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి.

విజయ్ క్రేజ్ వుండి కూడా మైత్రీ మూవీస్ ఆంధ్రలో డియర్ కామ్రేడ్ ను 9 నుంచి 10 కోట్ల రేషియోలో ఇచ్చేసింది. అదే సంస్థ చిత్రలహరి సినిమాను అయిదు కోట్లకు పైగా రేషియోలో ఆంధ్రకు ఇచ్చేసింది. దానివల్ల సినిమా యావరేజ్ అయినా బయ్యర్లు సేఫ్ అవుతారు. సినిమాకు నెగిటివ్ ఎక్కువ రాకుండా వుంటుంది.

సినిమా రంగంలో వున్న కట్టుబాటు ప్రకారం, ఎక్కువకు ఇచ్చి, లాస్ అయితే మళ్లీ నిర్మాతే తరువాత సినిమాకు సర్దుబాటు చేయాల్సి వుంటుంది. ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకని ముందే కాస్త రీజనబుల్ గా ఇచ్చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close