హిట్ ఫ్రాంచైజీ.. నాని సూప‌ర్ ప్లాన్‌

హిట్ సినిమాతో నాని నిర్మాత‌గానూ హిట్టు కొట్టాడు. ఇప్పుడు హిట్ 2 సెట్స్‌పైకి వెళ్లింది. హిట్ లో విష్వ‌క్‌సేన్ హీరో అయితే, హిట్ 2లో మాత్రం అడ‌విశేష్ న‌టిస్తున్నాడు. ఓ హిట్ సినిమా ఫ్రాంచైజీలో హీరో మారిపోవ‌డం అరుదుగా జ‌రిగే విష‌యం. ఓ సూప‌ర్ హిట్ సీక్వెల్ ని వ‌దులుకోవడం అంటే.. ఏ హీరోకైనా ఇబ్బందే. ఈ విష‌య‌మై విశ్వ‌క్ స్పందించాడు.

”హిట్ 2 కూడా నాతోనే చేద్దామ‌నుకొన్నారు. కానీ.. కాల్షీట్లతో ఇబ్బంది వ‌చ్చింది. నా కోసం టీమ్ ని ఆగమ‌న‌డం క‌రెక్ట్ కాదు. అందుకే మ‌రో హీరోతో హిట్ 2 చేస్తున్నారు. నాని అన్న కూడా.. ఒక్కో పార్ట్ ఒక్కో హీరోతో చేస్తే బాగుంటుంది అన్నాడు.. అలా హిట్.. ఫ్రాంచైజీ ఎప్పుడొచ్చినా హీరో మారుతూ ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు విష్వ‌క్ సేన్‌. అంతేకాదు… నాని వేసిన మాస్ట‌ర్ ప్లాన్ ఏమిటంటే.. హిట్ 2, 3, 4 ఒక్కో హీరోతో తీసి, ఆ హీరోలంద‌రినీ క‌లిపి మ‌రో సినిమా చేస్తాడ‌ట‌. అంటే… ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌కి ఇప్ప‌టి నుంచే రంగం సిద్ధం అవుతోంద‌న్న‌మాట‌. హిట్ క‌థ‌కీ, హిట్ 2 క‌థ‌కీ సంబంధం ఉండ‌ద‌ని, హీరో క్యారెక్ట‌ర్లు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. హిట్ లో విశ్వ‌క్‌సేన్ చాలా ఎగ్ర‌సీవ్‌గా క‌నిపిస్తాడు. అయితే హిట్ 2లో అడ‌విశేష్ మాత్రం కూల్ అండ్ కామ్ గా ఉంటాడ‌ట‌. అంటే… హీరో ఇమేజ్‌ని బ‌ట్టి హిట్ ఫ్రాంచైజీలో పాత్ర‌లు మారిపోతుంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close