వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అందరూ లోకేష్ పేరు తల్చుకుంటున్నారు. అమ్మో లోకేష్ అని భయపడుతున్నారు. అంబటి రాంబాబు పార్టీ వేదికపై కూర్చుకుని నారా లోకేష్ ఎందుకు మాపై కేసులు పెడుతున్నారని బేలగా అడుగుతున్నారు. మేమంతా మీపై కక్ష పెంచుకుంటామని బెదిరిస్తున్నారు. చివరికి కేసుల విషయంలోనూ ఆయన నారా లోకేష్ కు మాత్రమే ట్యాగ్ చేసి అడుగుతున్నారు. అంబటి రాంబాబు పార్టీ వేదిక పై నుంచి అలాంటి బేల బెదిరింపులు ఇస్తున్నారంటే.. మిగతా వారి సంగతి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు.
చంద్రబాబు అంటే మెతక మనిషి. రాజకీయాల ముసుగులో ఏం చేసినా ఆయన పట్టించుకోరు. వేధిస్తున్నారన్న ఆరోపణల్ని ఆయన మీద వేసుకోరు అని వైసీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే గతంలో టీడీపీ నేతలపై ఎన్ని ఘోరాలు చేసినా.. చంద్రబాబు వచ్చినా ఏమీ చేయరు.. చేయలేరు అని ప్రచారం చేసుకునేవారు. చట్టం ప్రకారం వెళ్తారని.. ఆ చట్టాలు తమ చుట్టాలేనని అనుకునేవారు. ఆ ధైర్యంతోనే ఇప్పుడు కూడా నేరాలకు పాల్పడుతున్నారు. కానీ ఆ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయని పోలీసులు చూపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు కంటి మీద కనుకు ఉండటం లేదు.
అసాఘింకశక్తులుగా మారాలనుకుంటే ప్రతి ఒక్కరికి చట్టం పవర్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. అధికారంలో లేకపోయినా.. వంశీ ప్రభుత్వంపైనే కుట్ర చేశారంటే.. చిన్న విషయం కాదు. అలాంటి వాళ్లు నేరుగా వచ్చి దొరికేదాకా వెయిట్ చేసి.. చట్టం పవర్ చూపిస్తున్నారు. మిగిలిన వారూ అంతే. తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టే అవకాశాలు కనించడం లేదు. చివరికి సుప్రీంకోర్టు వరకూ వెళ్లే అవకాశం ఇచ్చి .. వారు చేసిన తప్పులకూ ఎక్కడా బెయిల్ కూడా దొరకని పరిస్థితి కల్పించి చట్టం ముందు పెట్టి శిక్షిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. నారా లోకేష్ పేరును తల్చుకుని భయపడుతున్నారు.
మేము వస్తే అని బెదిరిస్తున్నారు వైసీపీ నేతలు. కక్ష పెంచుకుంటామని హెచ్చరిస్తున్నారు. గతంలో చంద్రబాబు,లోకేష్ ప్రభుత్వంలో ఉన్నారు. కానీ వారు ఎందుకు కక్ష సాధించలేదు ?. అప్పట్లో పాలన మాత్రమే చేశారు. దాన్ని అలుసుగా చేసుకుని తాము అధికారంలోకి వచ్చాక.. టీడీపీని, టీడీపీ నేతల్ని.. ఎవరూ ఊహించనంతగా వేధించారు. మామూలుగా అయితే అలాంటి వేధింపులు భరించి అధికారంలోకి వచ్చిన వారు పగ తీర్చుకునేవారు. అలా తీర్చుకుని ఉంటే ఎంత మంది పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యేదో చెప్పాల్సిన పని లేదు. కానీ లోకేష్ అలాంటి వాటిని ప్రోత్సహించలేదు.
చట్టాలను ఉల్లంఘించి , అత్యంత ఘోరంగా వ్యవహరించిన వైసీపీ నేతలు శిక్ష అనుభవించాల్సిందే. కాళ్ల బేరానికి.. చేతుల బేరానికి వచ్చినా ఎవరూ క్షమించే అవకాశం లేదు. బెదిరిస్తే.. ఎవరూ భయపడరు అని.. వైసీపీ నేతలుక ఇప్పటికైనా తెలుస్తుందేమో ?