పాదయాత్రలో లోకేష్ మాట్లాడకూడదని చట్టం చేశారా !?

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడల్లా పోలీసులు విరుచుకుపడుతున్నారు. మైకులు .. వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఎవరో చెప్పకపోతే పోలీసులు అలా చేయరు. లోకేష్ ను మాట్లాడకుండా చేయాలని ఒత్తిడి తెస్తూండటంతో.. పోలీసులు … లోకేష్ మైక్ అందుకోగానే అడ్డం పడుతున్నారు. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుండి అదే పరిస్థితి. ప్రసంగించడానికి పక్కనున్న మిద్దెలు.. లేకపోతే స్టూల్స్ వేసుకుని మాట్లాడాల్సి వస్తోంది.

ఒకప్పుడు నారా లోకేష్ మాట్లాడితే… ఆయన ఎక్కడైనా తప్పు మాట్లాడతారమో… ఎడిట్ చేసుకుని ట్రోల్స్ చేసుకుందామని వైసీపీ నేతలు ఎదురు చూస్తూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు లోకేష్ తడబడటం పూర్తిగా తగ్గిపోయింది. ఆయన నేరుగా పంచ్‌లు వేస్తున్నారు. సీఎం జగన్ పై ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ సూటిగా తగులుతున్నాయి. ట్రోల్ వేసుకోవడానికి ఎలాంటి స్టఫ్ దొరకకపోగా… ఆయన స్పీచ్‌లోని పాయింట్లు సూటిగా తగులుతూండటంతో.. మాట్లాడకుండా చేయడమే మంచిదని అనుకున్నట్లుగా కనిపిస్తోంది. లోకేష్ పాదయాత్ర విషయంలో ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్నది మానిటర్ చేసేందుకు సజ్జల ఓ టీమ్ ను నియమించారని చెబుతున్నారు. ఇందులో ఇంటలిజెన్స్ పోలీసులు కీలకంగా ఉన్నారని అంటున్నారు.

జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మైక్ పెట్టుకుని మాట్లాడేవారు. పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. పోలీసులు అన్ని చోట్లా అడ్డుకుని సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుంటున్నారు . సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారమే అడ్డుకుంటున్నాం కానీ… ప్రభుత్వం చెప్పినందు వల్ల కాదంటున్నారు. మొత్తంగా లోకేష్ పాదయాత్ర విషయంలో .. వైసీపీలో ఓ రకమైన అలజడి కనిపిస్తోంది.. వారి తీరుతోనే స్పష్టమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close