మహానాడులో నారా లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో మహానాడు ముగింది. లోకేష్ కు వర్కింగ్ ప్రెసెడింట్ పదవి ఇవ్వాలన్న సూచనలు కొంత మంది నేతలు వేదికపై చేశారు కానీ.. తీర్మానం చేయలేదు. పార్టీలో లోకేష్ కు కీలక బాధ్యతలు ఇస్తున్నారా అని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో వచ్చిన ప్రశ్నలకూ చంద్రబాబు అదే తరహాలో సమాధానం ఇచ్చారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు కానీ.. పార్టీని బలోపేతం చేయడంలో లోకేష్ సమర్థంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు.
లోకేష్ అప్రకటిత వర్కింగ్ ప్రెసిడెంట్
వారసుడ్ని రద్దుతున్నారు అన్న భావన రాకుండా.. పార్టీని నడిపే సామర్థ్యం ఉందని లోకేష్ నిరూపించుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. పదవులు ప్రకటించలేదు. కానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పేరుకే ఆ బాధ్యతల్లో ఉన్నా ఆయన మాత్రం.. వర్కింగ్ ప్రెసిడెంట్ గానే పని చేస్తున్నారు. పార్టీ తరపున అన్ని వ్యవహారాలు చక్క బెడుతున్నారు. చంద్రబాబు పాలనపై దృష్టి పెడితే.. లోకేష్ పార్టీపై దృష్టి పెట్టారు. అదే సమయంలో తన మంత్రి బాధ్యతల విషయంలోనూ మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆయన రాటుదేలే అవకాశం ఉంది.
సరైన సమయం చూసి ప్రకటన
రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం. ఎంత మంచి నిర్ణయం అయినా టైమింగ్ ప్రకారం ప్రకటిస్తే దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించే విషయంలోనూ చంద్రబాబు ఇలాంటి టైమింగ్ కోసం ఎదురు చూస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే ఆయన పని తీరు మెరుగ్గా ఉంది. పార్టీని నడుపుతున్న విధానంపై చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారు. పార్టీనే ఫైనల్ అనే రీతిలో సామాన్య కార్యకర్తలకూ గుర్తింపు ఇస్తున్నారు. వారి సంక్షేమం చూస్తున్నారు. లోకేష్ ఈ విషయంలో వంద శాతం ఎఫర్ట్ పెడుతున్నారు.
ఎన్డీటీవీ ఇంటర్యూలో కీలక అంశాలపై చంద్రబాబు క్లారిటీ
ఎన్డీటీవీ చేసిన సుదీర్ఘ ఇంటర్యూలో చంద్రబాబు కింగ్ మేకర్ అనే ఇంటర్యూయర్ మాటల్ని చాలా స్పష్టంగా తోసిపుచ్చారు. బీజేపీ విజయాలను ఆయన గౌరవించారు. మోదీ నాయకత్వాన్ని పొగడటానికి ఏ మాత్రం సంకోచించలేదు. అలాగే కాంగ్రెస్ ఎలా విఫల రాజకీయాలు చేస్తుందో వివరించారు.